Madhuri Dixit: భన్సాలీ వెబ్‌సిరీస్‌లో మాధురి

వెండితెరపై అద్భుతంగా రాణిస్తున్న వాళ్లు ఇప్పుడు వెబ్‌ బాట పడుతున్నారు. వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

Published : 23 May 2021 00:30 IST

వెండితెరపై అద్భుతంగా రాణిస్తున్న వాళ్లు ఇప్పుడు వెబ్‌ బాట పడుతున్నారు. వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’. ఇందులో మాధురి దీక్షిత్‌ ఆడిపాడనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సిరీస్‌లో సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి ఎంపికయినట్టు తెలుస్తోంది. ‘‘ఈ సిరీస్‌కు నటీనటుల ఎంపిక దాదాపు పూర్తయింది. దీన్ని భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు భన్సాలీ. ఇందులోని ఓ పాటలో మాధురీ మెరవనున్నారు. అది ఈ సిరీస్‌కు ప్రత్యేకంగా నిలవనుంది. మాధురి ఇందులో నటించడానికి ఇష్టంగానే ఉన్నారు. ఈ పాటకు మాధురి డ్యాన్స్‌ చేస్తేనే న్యాయం జరుగుతుందని భన్సాలీ భావిస్తున్నారట. మాధురిపై పది రోజులు షెడ్యూల్‌   చేయనున్నారట. దీని కోసం భారీ పారితోషిమూ ఇవ్వనున్నారు’’ అని భన్సాలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో భన్సాలీ తెరకెక్కించిన ‘దేవ్‌దాస్‌’ చిత్రంలో చంద్రముఖి పాత్రలో నటించారు మాధురి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని