manasantha nuvve: 20 వసంతాల మనసంతా నువ్వే.. ఈ విశేషాలు తెలుసా?
మనసంతా నువ్వే విడుదలై నేటికి 20 ఏళ్లు
‘తూనీగ..తూనీగ..’ అంటూ ప్రేమకథతో కుర్రకారు గుండెల్ని తొలిచేసిన సినిమా ‘మనసంతా నువ్వే’. ఉదయ్కిరణ్ని స్టార్గా మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. ప్రేమకథల్లో నూతన ఒరవడిని సృష్టించి, ట్రెండ్సెట్టర్లా నిలిచిందీ సినిమా. ‘మనసంతా నువ్వే’ విడుదలై నేటికి 20 ఏళ్లు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విశేషాలు..
ట్రెండ్ మార్చాలని
నిర్మాత యం.యస్ రాజు నిర్మించిన ‘దేవీపుత్రుడు’ 2001 సంక్రాంతికి విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీనికన్నా ముందు ‘దేవీ’ తీశారు. రెండు ఒకరకమైన సినిమాలు కావడంతో, ఇక రూట్ మార్చాలని నిర్ణయానికొచ్చారాయన. అందమైన ప్రేమకథతో అదిరిపోయే సినిమా తీయాలని తహతహలాడిపోయారు. చాలామంది దర్శకులను అనుకున్నారు. కొత్త దర్శకుడైతేనే బాగుంటుందని కెమెరామేన్ ఎస్. గోపాల్రెడ్డికి తన మనసులో మాట చెప్పారు. ఆయన వెంటనే జయంత్ సి.పర్జానీ, సింగీతం శ్రీనివాస్ల దగ్గర చేసిన కత్తిలాంటి కుర్రాడున్నాడని ఫోన్ నంబరిచ్చారు. ఆ చాకులాంటి కుర్రాడే ‘మనసంతా నువ్వే’ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య.
అలా మొదలైంది
అంత పెద్ద నిర్మాత నుంచి పిలుపు రావడం వి.ఎన్.ఆదిత్య నమ్మలేకపోయారు. నాలుగైదు సార్లు ఫోన్ చేసిన వెళ్లేందుకు ధైర్యం చాల్లేదాయనకి. చివరిసారి ఫోన్ రావడంతో ఇక వెళ్లక తప్పలేదు. ధైర్యం చేసి సుమంత్ ఆర్ట్స్ ఆఫీసుకి వెళ్లారు. ఎం.ఎస్. రాజుని కలిస్తే తన దగ్గరున్న ఒక ఐడియాను పంచుకున్నారు. ‘ప్రేమించుకుందాం రా’ కథలా ఉంది. దానికి అసోసియేట్ డైరెక్టర్గా పని చేశాను. చేసిన కథనే మళ్లీ తీయాలేను సర్’ అని వి.ఎన్. ఆదిత్య మొహం మీదే చెప్పేశాడు. ఆ ముక్కుసూటితనం నచ్చి తను అనుకున్న అసలు కథను వినిపించాడు. ఆ పాయింట్ వినగానే మొహం బల్బులా వెలిగింది. తెగ నచ్చేసింది. వెంటనే సినిమా చేసేందుకు అంగీకరించాడు. అలా ‘మనసంతా నువ్వే’ మొదలైంది.
ఎడిటింగ్ మాయ
కొద్దిరోజులకే ఉదయ్ కిరణ్ హీరోగా ‘మనసంతా నువ్వే’ సినిమాను ప్రకటించారు నిర్మాత. అప్పుడే మరో పెద్ద చిక్కొచ్చిపడింది. ఈ స్ర్కిప్ట్ చదివిన పరుచూరి బ్రదర్స్ కథ ఏమాత్రం బాగోలేదన్నారు. దీంతో మళ్లీ కథా చర్చలు మొదలయ్యాయి. యం.ఎస్. రాజు, వి.ఎన్. ఆదిత్య, వీరూపోట్ల, పరిచూరి బ్రదర్స్ కలిసి కథకు కొత్తరూపం తీసుకొచ్చారు. శిల్పంలా చెక్కి అద్భుతమైన కథగా మారిన తర్వాత కానీ వారికి సంతృప్తి దొరకలేదు. పదిరోజుల్లో సెట్స్ మీదకు వెళ్లింది. నాలుగు నెలల్లోనే సినిమా అంతా పూర్తయింది. షూటింగ్ అయిపోయాక మళ్లీ అందరి మొహాల్లో నిరాశ. క్లైమాక్స్ సరిగా పేలట్లేదని ఎడిటింగ్ రూం నుంచి బయటకొచ్చేశారు. ఇదంతా వింటున్న ఎడిటర్ కె.వి. కృష్ణారెడ్డి కాస్త మార్పులు చేసి.. ‘మళ్లీ ఓసారి చూడండి’ అని క్లైమాక్స్ చూపించారు. సినిమా ఆరంభంలో వచ్చే ‘నీ స్నేహం’ పాటను తిరిగి క్లైమాక్స్లో పెట్టడం భలే కుదిరింది. ఆనందంతో ఎగిరి గంతులేశారు. అదే ఏడాది దసరాకు విడుదల చేశారు. తెలుగు చిత్రసీమలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది.
ఇదీ కథ
సినిమా కథ అరకు లోయలో మొదలవుతుంది. అను సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. చంటిది నిరుపేద కుటుంబం. వీరిద్దరూ బాల్యంలో మంచి స్నేహితులవుతారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఈ స్నేహం అను వాళ్ల నాన్నకు నచ్చదు. ఒకరోజు వాళ్ల నాన్నకి బదిలీ అవడంతో అను కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోతుంది. విడిపోయే ముందు గుర్తుగా ఒక గడియారాన్ని చంటికికానుకగా ఇస్తుంది. కొన్నాళ్లకు తల్లి కూడా చనిపోవడంతో అనాథగా మారతాడు చంటి. మోహన్రావు దంపతులు చంటిని చేరదీసి కొత్త జీవితమిస్తారు. వేణు అని పేరు మారుస్తారు. విదేశాల్లో చదువు పూర్తిచేసుకొని ఇండియాకి తిరిగొచ్చాక చంటికోసం అను వెతుకుతుంది. ఎక్కడా చిన్ననాటి ప్రియుడి జాడ దొరకదు. దీంతో వారి ప్రేమకథనే రేణు అనే కలం పేరుతో ఓ మ్యాగజైన్ ‘మనసంతా నువ్వే’ సీరియల్గా రాస్తుంది. అది సూపర్హిట్ అవుతుంది. వేణు చెల్లెలి ద్వారా అనుతో పరిచయం ఏర్పడుతుంది. ఓ సందర్భంలో వేణు మరెవరో కాదు చంటినే అని అనుకి తెలుస్తుంది. అసలు వివరాలు చెప్పకుండా స్నేహం చేస్తుంది. ‘మనసంతా నువ్వే’ సీరియల్ చదివిన తర్వాత చిన్ననాటి ప్రేయసి అనునే అన్న విషయం చంటికి తెలుస్తుంది. వీరిద్దరి మధ్య అను వాళ్ల నాన్న విలన్లా మళ్లీ ప్రవేశిస్తాడు. అన్ని అడ్డంకులు దాటుకొని చివరకు వీరిద్దరూ ఒక్కటవడంతో ఈ ప్రేమకథ సుఖాంతం అవుతుంది.
మలయాళం నుంచి బాణీ
సినిమా విజయంలో ‘తూనీగ..తూనీగ’ పాటకి భాగముంది. అంతగా హిట్టైన గీతమది. బాల్యంలో వచ్చే ప్రేమకథకు ఆయువుపట్టులాంటి పాట. అయితే ఈ ట్యూన్ ఆర్పీపట్నాయక్ సొంతగా చేసింది కాదు. మలయాళ చిత్రం ‘ప్రణయవమంగళ్’లోని “కన్నాడీ కూడుమ్ కూట్టి” గీతం నుండి తీసుకున్నారు. ‘తూనీగ..తూనీగ..’ తోపాటు ఆర్పీపట్నాయక్ స్వరపరిచిన అన్ని పాటలు అలరించాయి. ఇందులోని పాటలంన్నిటికీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ‘చెప్పవే ప్రేమా..చెలిమి చిరునామా’, ‘నీ స్నేహం ఇక రాదు అని’, ‘కిటకిట తలుపులు’ ఇలా ఆర్పీ పట్నాయక్ స్వరపరిచిన బాణీలన్నీ యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. అతిథి పాత్రలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మెరవడం మరో విశేషం.
ఉదయ్కిరణ్కి హ్యాట్రిక్ హిట్
గత చిత్రాలతో నష్టపోయిన ఎం.ఎస్. రాజు వసూళ్ల సునామీలో మునిగితేలారు. ఐదారు భాషల్లో రీమేక్ అయిందీ సినిమా. ‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్కిరణ్కిది హ్యాట్రిక్ హిట్. ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ ఒకే ఏడాది విడుదలయ్యాయి. ‘నువ్వునేను’ వర్షాకాలంలో వచ్చి తెలుగు యువతను వలపు వానలో ముంచేసింది. ఇది విడుదలైన రెండు నెలలకి ‘మనసంతా నువ్వే’ దసరాకి వచ్చి ట్రెండ్ సృష్టించింది. ఈ విజయంతో ఉదయ్కిరణ్ స్టార్గా మారిపోయాడు. ‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్కిరణ్, రీమాసేన్లకు ‘మనసంతా నువ్వే’ మరిచిపోలేని విజయాన్ని అందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్