Kannappa: ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప

ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపే ఓ దృశ్య కావ్యంలా ‘కన్నప్ప’ సినిమా రూపొందుతోందని తెలిపారు మంచు విష్ణు.

Updated : 09 Nov 2023 12:49 IST

ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపే ఓ దృశ్య కావ్యంలా ‘కన్నప్ప’ సినిమా రూపొందుతోందని తెలిపారు మంచు విష్ణు. ఆయన ప్రధాన పాత్రధారిగా... ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఓ కీలక పాత్రని పోషిస్తారని తెలుస్తోంది. మోహన్‌బాబు, విష్ణు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా న్యూజిలాండ్‌లో ఏకధాటిగా చిత్రీకరణ జరుగుతోంది. ‘‘ఈ సినిమా 80 శాతం చిత్రీకరణ న్యూజిలాండ్‌లోనే జరుగుతుంది. ఇక్కడి ప్రకృతిని, అందమైన ప్రదేశాల్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తున్నాం. ఇలాంటి చిత్రానికి న్యూజిలాండ్‌ వాతావరణమే సరైనది. ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ వంటి చిత్రాల్రిన కూడా ఇక్కడే తెరకెక్కించారు. దేవుడి సృష్టించిన ఓ అందమైన పెయింటింగ్‌లా ఉంటుంది న్యూజిలాండ్‌. ‘కన్నప్ప’  భావోద్వేగాలు మరింత ప్రభావవంతంగా తెరపైకి వచ్చేందుకు న్యూజిలాండ్‌ లొకేషన్లు దోహదం చేస్తాయి. దీనికి తోడు అత్యాధునిక సినిమాటిక్‌ సాంకేతికతని ఉపయోగిస్తున్నాం. రాబోయే తరాలకీ గుర్తుండిపోయేలా ఓ కళాఖండంలా ఈ సినిమా ఉంటుంద’’ని మంచు విష్ణు తెలిపారు. ఇటీవలే ఈ సినిమా సెట్లో గాయపడిన విష్ణు మళ్లీ కోలుకుని చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని