Rajinikanth: శ్రీదేవికి రజనీ కంటే ఎక్కువ పారితోషికం

దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌ అని సంబోధిస్తుంటారు.

Updated : 06 May 2024 14:54 IST

ముంబయి: దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌ అని సంబోధిస్తుంటారు. ఇప్పుడంటే సినీతారలు అందుకునే పారితోషికాలు లక్షలు, కోట్లల్లో ఉంటున్నాయి. కానీ, 1970ల కాలంలో వేలల్లో తీసుకునేవారు. ఆ సమయంలోనే శ్రీదేవి..రజనీకాంత్‌ కంటే ఎక్కవగా పారితోషికం తీసుకున్నారట. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’. 1970లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. కె.బాలచందర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు గానూ కమల్‌హాసన్‌ తీసుకున్న పారితోషికం రూ.30వేలు కాగా.. రజనీకాంత్‌ కేవలం రూ.2000 తీసుకున్నారట. శ్రీదేవి మాత్రం రజనీ కంటే ఎక్కువగా రూ.5000 పారితోషికంగా తీసుకున్నారట. అప్పట్లో కమల్‌హాసన్‌ పేరున్న నటుడు కాబట్టి వారికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ భారతదేశ బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్లల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో శ్రీదేవి ఆకస్మిక మరణం అందరినీ కలిచివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని