Nayanthara: తిరుమలలో నయన్‌-విఘ్నేశ్‌ పెళ్లి..?

సెలబ్రిటీ కపుల్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరికీ గతేడాదిలోనే నిశ్చితార్థమైంది...

Updated : 07 May 2022 11:21 IST

హైదరాబాద్‌: సెలబ్రిటీ కపుల్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరికీ గతేడాదిలోనే నిశ్చితార్థమైంది. దీంతో వీరి పెళ్లి  వార్త కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకొందని.. జూన్‌ 9న వీరి వివాహం ఉండనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరు ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారని.. సినీ సెలబ్రిటీలు, ఇతర స్నేహితుల కోసం చెన్నైలో గ్రాండ్‌గా వివాహ విందు ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే.. ఈ వార్తలపై నయన్‌, విఘ్నేశ్‌ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, విఘ్నేశ్‌ దర్శకత్వంలో నయన్‌, సమంత, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాతువక్కుల రెందు కాదల్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్‌ను  సొంతం చేసుకోవడంతో నయన్‌-విఘ్నేశ్‌ గత కొన్నిరోజులుగా దేశంలోని పలు ప్రముఖ దేవాలయాలకు వెళ్లి వస్తున్నారు. అలా, వీరిద్దరూ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని