Aadikeshava: ఓ అమ్మాయో.. నీదేం మాయో

‘హే బుజ్జి బంగారం ప్రేమెనా ఇదంతా.. హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా’ అంటూ తన ప్రియురాలి కోసం పాడుతున్నాడు కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌.

Updated : 12 Oct 2023 14:00 IST

‘హే బుజ్జి బంగారం ప్రేమెనా ఇదంతా.. హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా’ అంటూ తన ప్రియురాలి కోసం పాడుతున్నాడు కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌. ఆయన.. శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదికేశవ’. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి పాట ‘సిత్తరాల సిత్రావతి’కి పరిశ్రమలో మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘హే బుజ్జి బంగారం’ అనే మరో పాటను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం. ‘ఓ అమ్మాయో.. నీదేం మాయో.. ప్రేమాకాశం అందించావే’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జి.వి ప్రకాష్‌ సంగీతమందించిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, యామిని ఘంటసాల ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని