Vaishnav Tej: రాముడు కాదప్పా.. రుద్ర కాళేశ్వరుడు

కథానాయకుడు వైష్ణవ్‌తేజ్‌ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్‌.ఎన్‌.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Published : 23 Jun 2022 07:03 IST

కథానాయకుడు వైష్ణవ్‌తేజ్‌ (Vaishnav Tej) కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్‌.ఎన్‌.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల(Sree Leela) కథానాయిక. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సాయితేజ్‌(Sai tej) క్లాప్‌నివ్వగా.. సుధీర్‌వర్మ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. త్రివిక్రమ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఎస్‌.నాగవంశీ చిత్ర దర్శకుడికి స్క్రిప్ట్‌ అందించారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సినిమాకి సంబంధించిన డైలాగ్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘రేయ్‌ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్‌. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా’’ అని ప్రతినాయకుడు హెచ్చరించడం.. దానికి బదులిస్తూ ‘‘ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు. సూస్కుందాం రా.. తలలు కోసి సేతికిస్తా..’’ అని హీరో సవాల్‌ విసరడం ఈ ప్రచార చిత్రంలో కనిపించింది. అలాగే వైష్ణవ్‌ మాస్‌ లుక్‌తో సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్‌ చిత్రీకరణ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని