Radheshyam: అతిపెద్ద చిత్ర పరిశ్రమగా అవతరించనున్నాం
‘‘ప్రేమకు... విధికి మధ్య జరిగే యుద్ధం’’ ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ‘రాధేశ్యామ్’ చిత్రబృందం. ఈ నెల 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన
‘‘ప్రేమకు... విధికి మధ్య జరిగే యుద్ధం’’ ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ‘రాధేశ్యామ్’ చిత్రబృందం. ఈ నెల 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రమిది. కె.రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జగపతిబాబు, సచిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, మిగతా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ పాన్ ఇండియా చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు. ‘‘మనం ఆలోచన చేస్తున్నామని భ్రమపడతాం... మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయి’’ అంటూ ప్రభాస్ కంఠంతో గంభీరంగా మొదలైంది టీజర్. ‘‘చేయి చూసి ఫీచర్ని... వాయిస్ విని పాస్ట్ని చెప్పేస్తావా?’’ అంటూ ప్రభాస్ పాత్రని పరిచయం చేశారు. విజువల్స్, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. ముంబయిలో జరిగిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ప్రభాస్, పూజా హెగ్డేలతో పాటు.. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆస్ట్రాలజీ కార్నర్లో ఓ హస్త సాముద్రికుడితో జ్యోతిషం చెప్పించుకున్నారు ప్రభాస్, పూజా హెగ్డే. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ ‘‘బాహుబలి’తో మొదలైన పాన్ ఇండియా చిత్రాల హవా ‘కేజీఎఫ్’, ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’తో మరింత పెరిగింది. భవిష్యత్తులో 50కి పైగానే పాన్ ఇండియా చిత్రాలు రానున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. భారతీయ చిత్రసీమ భవిష్యత్తులో ప్రపంచంలోనే అదిపెద్ద చిత్ర పరిశ్రమగా అవతరించనుంది’’ అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఆదిత్య అనే హస్తరేఖ శాస్త్రం తెలిసిన వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్బాబు, పూరి జగన్నాథ్ల కాంబినేషన్కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య