Raju Srivastava: ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాత్సవ కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాత్సవ (58) (Raju Srivastav) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో గత నెల 10న దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ....

Published : 21 Sep 2022 11:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాత్సవ (58) (Raju Srivastava) కన్నుమూశారు. గుండెపోటుతో గత నెల 10న దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గతనెలలో జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన రాజును కుటుంబసభ్యులు ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీ సైతం సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు 41 రోజులపాటు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. రాజు శ్రీవాత్సవ మరణంతో బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

‘ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌’తో రాజు శ్రీవాత్సవ స్టాండప్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ‘మైనే ప్యార్‌ కియా’, ‘మిస్టర్‌ ఆజాద్‌’, ‘బిగ్‌బ్రదర్‌’, ‘బాంబే టు గోవా’ వంటి బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి, తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. బిగ్‌బాస్‌ సీజన్‌-3 (హిందీ)లోనూ ఆయన కంటెస్టెంట్‌గానూ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని