Krishna Vamsi: రమ్యకృష్ణపై సన్నివేశాలు తీస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి
‘‘70వ దశకంలోని నాటకాన్ని ఆధారంగా తీసుకుని మరాఠీలో ‘నటసామ్రాట్’ చేశారు. మేం అందులోని ఆత్మని తీసుకుని నేటి పరిస్థితులకి... మన సమాజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ‘రంగమార్తాండ’ (Ranga Marthanda) చేశాం.
- దర్శకుడు కృష్ణవంశీ
‘‘70వ దశకంలోని నాటకాన్ని ఆధారంగా తీసుకుని మరాఠీలో ‘నటసామ్రాట్’ చేశారు. మేం అందులోని ఆత్మని తీసుకుని నేటి పరిస్థితులకి... మన సమాజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ‘రంగమార్తాండ’ (rangamarthanda) చేశాం. కొన్ని సినిమాలకి అన్నీ కుదురుతాయి, కొన్నిసార్లు కుదరదు. ఈ సినిమాకి అనుకున్నవన్నీ పక్కాగా కుదిరాయి’’ అన్నారు కృష్ణవంశీ (Krishna Vamsi). ఆయన దర్శకత్వంలో ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రంగమార్తాండ’. కాలీపు మధు నిర్మాత. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం హైదరాబాద్లో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘కథ బాగుంటే ప్రేక్షకులు సినిమాని స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మాస్ సినిమాల జోరు కొనసాగుతున్న సమయంలో ‘శంకరాభరణం’ వచ్చింది. ఈమధ్య ‘మహానటి’ వచ్చింది. అందరం అన్ని చిత్రాలూ బాగుండాలనే, ప్రేక్షకుల మెప్పు పొందాలనే తీస్తాం. ‘రంగమార్తాండ’ చూసినవాళ్లంతా బాగుందని చెప్పారు. అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. విడుదల తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి అదే రకమైన స్పందన వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. మరాఠీలో ‘నటసామ్రాట్’ కథ ఎక్కువగా షేక్స్పియర్ నాటకాల చుట్టూ సాగుతుంది. మేం మన నాటకాలకి అన్వయిస్తూ స్క్రిప్ట్ని తీర్చిదిద్దాం. ప్రకాశ్రాజ్ ఆంగ్లం, సంస్కృతం, తెలుగు... ఏదైనా మాట్లాడతాడు. గొప్ప నటుడు తను. రాఘవరావు పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మానందం తన పాత్ర లుక్ కోసం ఏమీ తినకుండా, ఎన్ని టేక్లైనా ఓపికతో చేశారు. పెద్ద పెద్ద డైలాగ్స్ని ఆయన చెప్పారు. రమ్యకృష్ణ చేసిన పాత్ర కోసం మొదట వేరే నటుల్ని పరిశీలించాం. తను కూడా కొన్ని పేర్లు సూచించింది. ప్రతి సినిమాలోనూ పెద్ద పెద్దగా అరుస్తూ నటిస్తుంటావెందుకని నేను, మా అబ్బాయి రమ్యకృష్ణని అడుగుతుంటాం. కానీ ఇందులో కళ్లతోనే భావాలు పలికించే పాత్ర తనది. తన కళ్లు చాలా బాగుంటాయి. ఓరోజు ఈ పాత్రని నువ్వే ఎందుకు చేయకూడదని అడిగా. తను ఒప్పుకోవడంతోపాటు, ఆ పాత్రకి మేకప్, హెయిర్స్టైల్ తనే చేసుకుంది. తనపై క్లైమాక్స్లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నప్పుడు కంట్లో నీళ్లొచ్చాయి. వాటిని దాదాపు 36 గంటలపాటు తీశా’’ అన్నారు. సినిమాలో కీలక పాత్ర పోషించిన రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ ‘‘కృష్ణవంశీ సర్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. అదే ప్రత్యేకం అనుకుంటే ఇందులో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం రావడం మరింత ఆనందాన్నిచ్చింది’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్