Aadavallu Meeku Johaarlu: అది ఇంచుమించు నరకం
శర్వానంద్, రష్మిక జంటగా తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, ఊర్వశీ, రాధికా శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం చిత్ర టీజర్ విడుదల చేశారు
శర్వానంద్, రష్మిక జంటగా తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, ఊర్వశీ, రాధికా శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం చిత్ర టీజర్ విడుదల చేశారు. ‘‘ప్రతి మగాడి జీవితంలో పెళ్లి అనేది ఓ ముఖ్యమైన ఘట్టం. ఇంట్లో పది మంది ఆడాళ్లు ఉండి.. ఒక అమ్మాయిని ఓకే చేయడమంటే ఇంచుమించు నరకం’’ అంటూ శర్వా వాయిస్ ఓవర్తో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. మహిళలు కుటుంబంపై ఆధిపత్యం చెలాయించడం వల్ల.. పెళ్లి విషయంలో శర్వా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది ప్రచార చిత్రంలో వినోదాత్మకంగా చూపించారు. అయితే రష్మిక తన జీవితంలోకి ప్రవేశించాక ఏం జరిగింది? ఆమె ప్రేమను సాధించడం కోసం అతనెలాంటి పాట్లు పడాల్సి వచ్చిందన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఆఖర్లో ‘‘మన పెళ్లి జరగదు’’ అని రష్మిక కూల్గా శర్వాకు చెప్పడం.. అనంతరం అతను ఓ వెర్రి నవ్వు నవ్వడంతో టీజర్ ఆసక్తికరంగా ముగిసింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. సుజిత్ సారంగ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!