Bigg boss 7 telugu: షాకింగ్.. ఈసారి డబుల్ ఎలిమినేషన్.. శుభశ్రీ, గౌతమ్ ఔట్.. కానీ!
బిగ్బాస్ సీజన్-7 (bigg boss 7 telugu)లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. నటి శుభశ్రీ రాయ్గురు, నటుడు గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారు.
హైదరాబాద్: ‘ఉల్టా పుల్టా’ అంటూ మొదలైన బిగ్బాస్ సీజన్-7 (bigg boss 7 telugu)లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. సీజన్-7 నుంచి నటి శుభశ్రీ రాయ్గురు, నటుడు గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారు. కానీ, గౌతమ్ కృష్ణను బిగ్బాస్ సీక్రెట్ రూమ్లో పెట్టడం గమనార్హం. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన చివరి ముగ్గురు కంటెస్టెంట్లుగా శుభశ్రీ, గౌతమ్కృష్ణ, టేస్టీ తేజలు నిలిచారు. వీరిలో తొలుత శుభశ్రీ ఎలిమినేట్ అయింది. అతి తక్కువ ఓట్లు వచ్చిన ఐదో కంటెస్టెంట్గా ఆమె ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. ఈ వారం నామినేషన్స్లో టేస్టీ తేజ, శివాజీ, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, అమర్దీప్లు ఉండగా, అందరినీ డార్క్ రూమ్లోకి పంపి ఎలిమినేట్ అయినవాళ్లు బయటకు వచ్చేస్తారని నాగార్జున తెలిపారు. దీంతో అతి తక్కువ ఓట్లు రావడంతో పాటు, హౌస్లో ఉండేందుకు అర్హతలేని చివరి ముగ్గురు కంటెస్టెంట్లలో శుభశ్రీ ఉండటంతో ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
ఈ సందర్భంగా బయటకు వచ్చిన శుభశ్రీ (Subhashree Rayaguru) అందరితోనూ నవ్వుతూ మాట్లాడింది. బిగ్బాస్ హౌస్ను తాను ఎంతో మిస్ అవుతున్నానని చెప్పింది. హౌస్మేట్స్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ప్రియాంకతో కలిసి పాటలు పాడటం, స్విమ్మింగ్ చేయడం మంచి అనుభూతి అని చెప్పింది. తేజ చాలా జోక్లు చెప్పేవాడని, తనని ఎంతో నవ్వించేవాడని చెప్పుకొచ్చింది. శివాజీ నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపింది. బయటకు వచ్చాక తప్పకుండా కలుస్తానని చెప్పింది. గౌతమ్తో చాలా సంతోషకరమైన సందర్భాలు ఉన్నాయని, తనని ఎంతో ఫ్లర్ట్ చేసేవాడని చెప్పుకొచ్చింది. అతను ఉప్మా చేస్తే, తాను పోపు వేశానంది. అలాగే, ప్రశాంత్ను అన్నా అని పిలుస్తానని ముఖ్యంగా ‘లోటా బిస్కెట్’ మూమెంట్ మర్చిపోలేనంటూ ఆ రోజు జరిగిన సంఘటనను పంచుకుంది. ఇక సందీప్ మాస్టర్తో ఉదయం డ్యాన్స్ చేయడం ఎంతో ఆనందంగా ఉండేదని తెలిపింది. ఇక ఆయన పవర్ అస్త్ర తీసుకున్నప్పుడు బాధగా అనిపించిందని తెలిపింది. అమర్దీప్ విషయంలో మనోభావాల మూమెంట్ సందర్భంగా బాధపడ్డానన్న శుభశ్రీ.. యాలకులు తినేటప్పుడు చేసే స్టైల్ మర్చిపోలేనని నవ్వుతూ చెప్పింది. మొదటి నుంచి చివరివరకూ నవ్వుతూనే హౌస్మేట్స్తో మాట్లాడింది. ఇక టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులు రాసిన ఉత్తరాన్ని శుభశ్రీ త్యాగం చేయగా, నాగార్జున తిరిగి దాన్ని ఆమెకు ఇచ్చారు.
ఇంటి సభ్యుల ఓట్లతో హౌస్ నుంచి బయటకు వచ్చిన గౌతమ్
ఊహించని విధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో గౌతమ్ కృష్ణ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిలో శుభశ్రీ వెళ్లిపోగా, చివరకు టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ మిగిలారు. ఈ క్రమంలో హౌస్లో ఉన్న ఎనిమిది మందిలో ఆరుగురు టేస్టీ తేజను సపోర్ట్ చేస్తూ ఓటు వేశారు. దీంతో గౌతమ్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బయటకు వచ్చాక గౌతమ్ మాట్లాడుతూ.. తన ఎలిమినేషన్ను అస్సలు ఊహించలేదని అన్నాడు. తాను టాస్క్లో బాగానే ఆడతానని చెబుతూనే తనకు వ్యతిరేకంగా ఓటు వేయడం చూస్తుంటే హౌస్మేట్స్ సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నారని అర్థమైందన్నాడు. మరి హౌస్లో ఉన్న వాళ్లలో ఎవరు రియల్? ఎవరు ఫేక్ ఎవరో చెప్పమని అడగ్గా.. గౌతమ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ మరో కోణం ఉందని గౌతమ్ ఈ సందర్భంగా అన్నాడు.
- హౌస్లో ఉన్న వాళ్లలో రియల్/ఫేక్ వీళ్లే..!
- అమర్దీప్: సందీప్, ప్రియాంక, శోభ, అమర్ కలిసి ఆడతారు. వాళ్ల వాళ్లనే ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు.
- సందీప్: సంచాలక్గా ఉన్నప్పుడు ఒకవైపు మాత్రమే స్టాండ్ తీసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఫేక్గా అనిపిస్తాడు.
- శోభ: అందరితోనూ ఇరిటేట్ అయిపోతుంది. మాట్లాడాలంటే భయపడతారు ఇక్కడ అందరూ వ్యక్తిగతంగా ఆడతారు. నువ్వూ అలాగే ఆడాలి.
- ప్రియాంక: చెల్లెమ్మా అని పిలుస్తా. అమర్, సందీప్, శోభలతో పోలిస్తే నువ్వు కాస్త అమాయకురాలివి. కానీ, ఆట విషయంలో నీ ఆట గురించే ఆలోచించు.
- తేజ: ఫేక్ కాదు. ఉన్నవాళ్లలో నిజాయతీ కలిగిన వ్యక్తి. ఎంటర్టైన్ చేస్తూ ఉండు. టాస్క్లో బాగా ఆడు. ఏ గ్రూప్ దగ్గరకీ వెళ్లకు.
- యావర్: శారీరకంగా చాలా స్ట్రాంగ్. నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు. గత వారం మంచి స్నేహితులు అయ్యాం. ఫేక్గా ఉండే సామర్థ్యం లేదు. గేమ్లో ఓడిపోతే వ్యక్తిగతంగా తీసుకోకు.
- శివాజీ: ఫేక్ సైడ్ఉంది. ఆయనకు నచ్చిన వ్యక్తులకు ఓటు వేస్తారు.
- ప్రశాంత్: ప్రశాంత్ సేఫ్ గేమ్ ఆడాడు. శివాజీ ఏది ఆడితే, అది ఆడతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు