Allu Arjun: వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: డైరెక్టర్ వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం కారణంగానే ‘ఆర్య’ (Arya Movie) పట్టాలెక్కిందని అల్లు అర్జున్ అన్నారు. ఆ చిత్రం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కిన ‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పూర్తిచేసుకున్నా సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక వేడుక నిర్వహించింది. అందులో అల్లు అర్జున్ (Allu Arjun) మాట్లాడుతూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
‘నేను నటించిన ‘గంగోత్రి’ సూపర్ హిట్ అయింది. కానీ ఆ చిత్రంతో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయాను. ఆ తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా కూర్చున్నా. రోజుకు మూడు కథలు వినేవాడిని. ఆ టైమ్లో ‘దిల్’ సినిమా ప్రీమియర్ షోకు వెళ్తే అక్కడ సుకుమార్ నన్ను చూశారు. తర్వాత ‘ఆర్య’ కథ చెప్పారు. చాలా నచ్చింది. నాకు ఇది ‘ఇడియట్’ సినిమా అవుతుందని ఊహించాను. అందరం కొత్త వాళ్లం కావడంతో దీన్ని తెరకెక్కించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సుకుమార్ (Director Sukumar) ఈ సినిమాను ఎలా రూపొందిస్తారో అని అందరూ సందేహపడ్డారు. ఆ సమయంలో వి.వి వినాయక్ (V.V. Vinayak) మాకు ధైర్యాన్నిచ్చారు. ‘నన్ను నమ్మండి. సుకుమార్ చాలా బాగా తీస్తాడు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే నేను వచ్చి డైరెక్షన్ చేస్తా’ అని హామీ ఇచ్చారు. ఆ ఒక్కమాట మాకు ఏనుగంత బలాన్నిచ్చింది. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఒకవారం షూటింగ్ చేశాక చూస్తే అద్భుతంగా అనిపించింది. సుకుమార్ దర్శకత్వం అందరికీ నచ్చింది. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు ఊపేశాయి’
‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
‘మొదట 10వారాలు ఆడుతుందన్నారు. 125 రోజుల షీల్డ్ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటా అని మా నాన్నతో కోపంగా చెప్పా. చెప్పినట్లు గానే చిరంజీవిగారి చేతుల మీదగా 125 రోజుల షీల్డ్ తీసుకున్నాను. నాకెంతో ఇష్టమైన ఆయన చేతులమీదగా షీల్డ్ తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. దిల్రాజు ధైర్యం చేసి డబ్బులు పెట్టారు. ఆ చిత్రానికి వర్క్ చేసినవాళ్లంతా ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. సుకుమార్ (Sukumar) లేకపోతే ఈ చిత్రం లేదు. అందరికంటే ముఖ్యంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలి’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్గేల్తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు