Chiranjeevi: పిక్‌ ఆఫ్‌ ది డే.. చిరు, నాగ్‌, వెంకీ ఒకే ఫ్రేమ్‌లో

చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ కలిసి దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. వారు కలవడానికి కారణమేంటంటే?

Published : 13 Nov 2023 02:02 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), వెంకటేశ్‌ (Venkatesh) ఒక్క చోట చేరారు. సంబంధిత ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఓకే ఫ్రేమ్‌లో ఈ ముగ్గురు కనిపించడంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ స్టార్‌ హీరోలు కలిసి ఎక్కడ సందడి చేశారో తెలుసా..? తమకు పాప (క్లీంకార) పుట్టిన తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు ప్రతి పండగను మునుపటికంటే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెలబ్రిటీలను ఆహ్వానించి దీపావళి సంబరాలు చేసుకున్నారు. చిరంజీవి ఇంట్లో శనివారం ఈ సందడి నెలకొనగా ఈ ముగ్గురు హీరోల ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి.

‘మేము ఇలా ఉన్నామంటే మీరూ, చిరంజీవిగారే కారణం’: శివాజీ సతీమణి

నాగార్జున, వెంకటేశ్‌లతోపాటు మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, మంచు మనోజ్‌ సతీసమేతంగా హాజరయ్యారు. కాగా, వీరి ఫొటోలు ఇప్పటికే వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్‌తేజ్‌, అఖిల్‌, అల్లు శిరీష్‌, వైష్ణవ్‌ తేజ్‌, మంచు లక్ష్మి కూడా ఈ వేడుకలో భాగమయ్యారు. మరోవైపు, ఎన్టీఆర్‌, వరుణ్‌తేజ్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి పండగ సెలబ్రేట్‌ చేసుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని