Bigg boss telugu 7: ‘మేము ఇలా ఉన్నామంటే మీరూ, చిరంజీవిగారే కారణం’: శివాజీ సతీమణి
హైదరాబాద్: తమ కుటుంబం ఈ స్థాయిలో ఉందంటే అందుకు నాగార్జున, చిరంజీవిలే కారణమని నటుడు శివాజీ (actor shivaji) సతీమణి శ్వేత అన్నారు. బిగ్బాస్ సీజన్-7లో (Bigg boss telugu 7) శివాజీ కంటెస్టెంట్గా ఉన్నసంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా హౌస్మేట్స్కు సంబంధించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు బిగ్బాస్ వేదికపైకి వచ్చి సందడి చేశారు. హౌస్లో ఉన్న వాళ్లతో మాట్లాడారు. టాప్-5లో ఎవరెవరు ఉంటారో తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా శివాజీ సతీమణి శ్వేత, ఆయన రెండో కుమారుడు రిక్కీలు వేదికపైకి వచ్చి మాట్లాడారు.
ఈ సందర్భంగా శివాజీ ఎలా ఆడుతున్నాడు? అని నాగార్జున అడగ్గా, ‘ఇంత బాగా ఆడతాడని అస్సలు ఊహించలేదు. . చేయి నొప్పి ఉన్నా మీ సహకారం వల్ల కోలుకున్నాడు. ఫోన్లో కూడా మాట్లాడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు’ అని శ్వేత సమాధానం ఇచ్చారు. ‘మొదటిసారి నా ఫ్యామిలీ ప్రపంచానికి పరిచయం అయింది. నా వైఫ్ పెద్దగా ఎవరికీ తెలియదు. అది కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఆమె పరిచయం కావడం సంతోషంగా ఉంది’ అని శివాజీ అన్నారు. ‘మేము ఇలా ఉన్నామంటే మీరు (నాగార్జున) చిరంజీవిగారే కారణం. అది ఇంకా గుర్తుంది..’ అంటూ శ్వేత భావోద్వేగానికి గురవుతూ ఏదో చెప్పబోగా, ‘అమ్మా.. నేనొక మాట చెబుతా.. నేను, చిరంజీవిగారు కాదు.. మీ ఆయన టాలెంట్’ అంటూ నాగార్జున (Nagarjuna) అన్నారు. ‘బాబుగారు మీ గురించి వీళ్లెవరికీ తెలియదండీ. మీరు ఇండస్ట్రీకి వచ్చిన ఓ పదేళ్లకు నేను వచ్చాను. కానీ, మీరెంత మందిని సపోర్ట్ చేసి, ఇండస్ట్రీకి పరిచయం చేశారో నా కళ్లతో చూశా. కుటుంబ నేపథ్యం ఉండొచ్చు కానీ, మంచితనం ఉండటం చాలా అరుదు. మీరు పెట్టిన భిక్ష ఇది. ఎంతమందికి అన్నం పెట్టారో. మాలాంటి వాళ్లందరూ మీకు రుణపడి ఉన్నారు’’ అని శివాజీ అన్నారు.
‘నువ్వు ప్రేక్షకుల మనసు గెలుచుకుందామని అక్కడకు వెళ్లావు. అది జరిగింది. చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ఆవేశ పడకు. నీ పాయింట్పై నిలబడు. నీ వెనుక జనం నిలబడతారు. మిమ్మల్ని అత్యున్నత శిఖరాల్లో చూడాలనుకుంటున్నా. నువ్వు ఎంత పెద్ద హీరోవో నాకు తెలియదు. కానీ, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక శివన్న ఉన్నాడు. అందరినీ గెలుచుకుని రా’ అని శివాజీ కొడుకు రీక్కీ అన్నాడు. ఇక టాప్-5 కంటెస్టెంట్లుగా శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, అమర్దీప్, ప్రియాంకలు ఉంటారని శివాజీ ఫ్యామిలీ చెప్పింది.
బిగ్బాస్ సీజన్-7 నుంచి భోలే షావలి ఔట్
బిగ్బాస్ సీజన్-7 నుంచి సంగీత దర్శకుడు భోలే షావలి (bhole shavali) ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్లో భోలే షావలి, గౌతమ్ కృష్ణ, శివాజీ, ప్రిన్స్ యావర్, రతికలు ఉండగా, అతి తక్కువ ఓట్లు వచ్చిన భోలే షావలి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ సందర్భంగా వేదికపై పాట పాడి, బిగ్బాస్ గేమ్ను భోలే షావలి నిష్క్రమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు.