మిథు.. ఆట మొదలైంది!

తాప్సీ సినీ ప్రయాణంలో దూకుడు కనిపిస్తోంది. కొత్తదనం నిండిన కథలకు.. సవాల్‌ విసిరే పాత్రలకు

Published : 06 Apr 2021 13:37 IST

ముంబయి: తాప్సీ సినీ ప్రయాణంలో దూకుడు కనిపిస్తోంది. కొత్తదనం నిండిన కథలకు.. సవాల్‌ విసిరే పాత్రలకు చిరునామాగా నిలుస్తూ బాక్సాఫీస్‌ ముందు సత్తా చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడామె ‘శభాష్‌ మిథు’ కోసం క్రికెటర్‌గా మారింది. భారత మహిళా క్రికెట్‌ సారథి మిథాలీ రాజ్‌ జీవిత కథతో రూపొందుతోన్న చిత్రమిది. రాహుల్‌ ధోలాఖియా దర్శకుడు. వయాకామ్‌ 18 సంస్థ నిర్మిస్తోంది.

ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ చిత్రం.. తాజాగా రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకుంది. దీనికి సంబంధించిన తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘లెట్స్‌ గో డే - 1’ అంటూ క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ ఫొటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఈ చిత్రం కోసం ఆమె కొన్ని నెలలుగా క్రికెట్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఇందుకోసం నూషిన్‌ అల్‌ ఖాదీర్‌ అనే కోచ్‌ను  నియమించుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు     రానుందని సమాచారం. ప్రస్తుతం తాప్సీ నటించిన ‘రష్మీ రాకెట్‌’, ‘లూప్‌ లపేటా’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని