వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.
తగిన ఆధారాలున్నాయి
హత్యకు అవినాష్ అండదండలు
బెయిల్ ఇస్తే పారిపోతారు.. సీబీఐ వాదన
తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
ఈనాడు, హైదరాబాద్: మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. హత్య జరిగిన సమయంలో సునీల్.. వివేకా ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా తేలిందని పేర్కొంది. వివేకా హత్య కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది అనిల్ తల్వార్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాది గూగుల్ టేక్ ఔట్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, హత్య సంఘటనలో సునీల్ యాదవ్ పాల్గొన్నారనడానికి అదొక్కటే ఆధారం కాదన్నారు.
‘‘వివేకా ఇంటి వద్ద వాచ్మెన్ రంగన్న, అప్రూవర్ దస్తగిరిలు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం సునీల్ యాదవ్ పాత్ర ఉంది. వివేకా హత్య అనంతరం పారిపోతుండగా గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్లను గుర్తించినట్లు రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. దీనికితోడు సీసీ టీవీ ఫుటేజీ, హత్యకు ముందు, తరువాత నిందితుల మధ్య ఫోన్ సంభాషణలకు కాల్ డేటా రికార్డు ఉన్నాయి. హత్యకు ముందురోజు సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్రెడ్డిలు గంగిరెడ్డి ఇంటివద్ద కలిశారు. వివేకా హత్య నిమిత్తం గొడ్డలి కొనాలంటూ దస్తగిరికి సునీల్యాదవ్ చెప్పారు. పులివెందులలో కొంటే తెలిసిపోతుందని, కదిరికి వెళ్లి తీసుకురమ్మని పురమాయించారు. ఇదే విషయాన్ని దస్తగిరి వెల్లడించారు. గొడ్డలి విక్రయించిన వ్యక్తిని సీబీఐ విచారించగా దస్తగిరి చెప్పిన సమాచారానికి అనుగుణంగానే ఉంది.
వివేకా హత్యకు కుట్ర, దాన్ని అమలు చేయడం, సాక్ష్యాల ధ్వంసంలో సునీల్యాదవ్ పాత్ర ఉంది. హత్య అనంతరం సాక్ష్యాల ధ్వంసం గురించి ఆందోళన అవసరం లేదని.. అవన్నీ శివశంకర్రెడ్డి, అవినాష్రెడ్డి చూసుకుంటారని గంగిరెడ్డి చెప్పారు. అంటే సాక్ష్యాలను ధ్వంసం చేయాలని వీరు ముందుగానే ప్రణాళిక రూపొందించారన్నమాట. వివేకా హత్యకు గంగిరెడ్డి నుంచి సునీల్ యాదవ్ రూ. కోటి తీసుకున్నారు. అందులో దస్తగిరికి రూ.75 లక్షలు ఇచ్చి రూ. 25 లక్షలు తరువాత ఇస్తానని చెప్పారు. దస్తగిరికి ఇచ్చిన సొమ్మును మున్నా వద్ద దాచి ఉంచగా రూ. 46 లక్షలు రికవరీ చేశారు. పరిస్థితుల ప్రకారం ఉన్న ఆధారాలను పరిశీలించినా సునీల్యాదవ్ పాత్ర ఉన్నట్లు తేలుతుంది.
వివేకాను దారుణంగా హత్య చేసి, తరువాత డ్రైవర్ దీనికి కారణమంటూ ఆయనతో బలవంతంగా లేఖ రాయించారు. హత్యపై వివేకా కుమార్తె, భార్య రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు బలవంతులు. సాక్షులను ప్రభావితం చేయగలరు. సీఐ శంకరయ్య, గంగాధర్రెడ్డిలు ముందు స్టేట్మెంట్ ఇచ్చి తరువాత మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. సునీల్యాదవ్ను గోవాలో అరెస్ట్ చేశాం. ప్రస్తుతం బెయిల్ ఇస్తే పారిపోయే అవకాశం ఉంది. శివశంకర్రెడ్డి కుట్రలో పాల్గొంటే, నిందితుడు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు. అందువల్ల శివశంకర్రెడ్డి బెయిలుతో పోలిక లేదు. బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలి’’ అని కోరారు.
సునీల్ యాదవ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సునీల్ సీబీఐ కస్టడీలో 25 రోజులపాటు ఉన్నారని, తరువాత కుటుంబంతో గోవా వెళ్లారన్నారు. సీబీఐ కస్టడీలో ఉన్నపుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సునీల్ యాదవ్ రూ.25 లక్షలు తీసుకుంటున్నట్లు సీబీఐ చెబుతోందని ఆ మొత్తాన్ని, గొడ్డలిని రికవరీ చేయలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ