Teja: హిందీలో రెండు ప్రాజెక్ట్‌లు

దర్శకుడు తేజ రెండు దశాబ్దాల తర్వాత తిరిగి బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 10 Apr 2022 13:52 IST

ర్శకుడు తేజ రెండు దశాబ్దాల తర్వాత తిరిగి బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిప్పుడు సెట్స్‌పై ముస్తాబవుతోంది. ఇది పూర్తయిన వెంటనే ఆయన బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు తెరకెక్కించనున్నారు. ఇందులో ఒకటి ‘జఖ్మీ’ అనే సినిమా కాగా.. మరొకటి ‘తస్కరి’ అనే వెబ్‌సిరీస్‌. ఈ రెండింటినీ టైమ్స్‌ ఫిల్మ్స్‌, ఎన్‌.హెచ్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘జఖ్మీ’ కశ్మీర్‌ నేపథ్యంలో సాగే చిత్రం. ఇందులో ఇద్దరు హీరోలుంటారు. 1980లో ముంబయిలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించే వెబ్‌సిరీస్‌  ‘తస్కరి’. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన    నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. తేజ 20ఏళ్ల క్రితం హిందీలో తుషార్‌ కపూర్‌ హీరోగా ‘యే దిల్‌’ అనే సినిమా తెరకెక్కించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని