Teja: హిందీలో రెండు ప్రాజెక్ట్లు
దర్శకుడు తేజ రెండు దశాబ్దాల తర్వాత తిరిగి బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన దగ్గుబాటి అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు తేజ రెండు దశాబ్దాల తర్వాత తిరిగి బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన దగ్గుబాటి అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిప్పుడు సెట్స్పై ముస్తాబవుతోంది. ఇది పూర్తయిన వెంటనే ఆయన బాలీవుడ్లో రెండు ప్రాజెక్ట్లు తెరకెక్కించనున్నారు. ఇందులో ఒకటి ‘జఖ్మీ’ అనే సినిమా కాగా.. మరొకటి ‘తస్కరి’ అనే వెబ్సిరీస్. ఈ రెండింటినీ టైమ్స్ ఫిల్మ్స్, ఎన్.హెచ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘జఖ్మీ’ కశ్మీర్ నేపథ్యంలో సాగే చిత్రం. ఇందులో ఇద్దరు హీరోలుంటారు. 1980లో ముంబయిలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించే వెబ్సిరీస్ ‘తస్కరి’. ఈ రెండు ప్రాజెక్ట్లకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. తేజ 20ఏళ్ల క్రితం హిందీలో తుషార్ కపూర్ హీరోగా ‘యే దిల్’ అనే సినిమా తెరకెక్కించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్