Nitya Menon: ఆ విషయం చెప్పగానే పవన్ ఆశ్చర్యపోయారు
‘‘నేనెప్పుడూ ఏ పాత్రని ఛాలెంజింగ్ అనుకోను. అలా అనుకుంటే అబ్బో చాలా కష్టపడ్డానేమో అనిపిస్తుంది. అందుకే ఏ పాత్రనైనా ఎంజాయ్ చేస్తూనే చేస్తా. కథ వింటున్నప్పుడే నేను నా పాత్రలోకి లీనమైపోతా’’ అంది నటి నిత్యామేనన్. వైవిధ్యభరిత కథా చిత్రాలకు చిరునామాగా నిలిచే ఆమె..
‘‘నేనెప్పుడూ ఏ పాత్రని ఛాలెంజింగ్ అనుకోను. అలా అనుకుంటే అబ్బో చాలా కష్టపడ్డానేమో అనిపిస్తుంది. అందుకే ఏ పాత్రనైనా ఎంజాయ్ చేస్తూనే చేస్తా. కథ వింటున్నప్పుడే నేను నా పాత్రలోకి లీనమైపోతా’’ అంది నటి నిత్యామేనన్. వైవిధ్యభరిత కథా చిత్రాలకు చిరునామాగా నిలిచే ఆమె.. ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు తెరకెక్కించారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది నిత్యామేనన్. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
ఈ కథని తొలుత నటిగా విన్నారా? నిర్మాతగా విన్నారా?
ముంబయిలో ఉన్నప్పుడు విశ్వక్ నాకీ కథ చెప్పారు. ఇంటర్వెల్ వరకు వినగానే.. ఈ సినిమా నేను చేస్తానని చెప్పా. తొలుత ఈ కథని నేను నటిగానే విన్నా. అయితే ఇలాంటి చిత్రాలు తెరపైకి రావడం అనుకున్నంత ఈజీ కాదు. నిర్మాణ పరంగా కొన్ని అవరోధాలు ఎదురవుతుంటాయి. అలాంటి కొన్ని సమస్యలు ఎదురైనప్పుడే ఈ చిత్రానికి సహాయ పడాలనిపించింది. ఈ క్రమంలోనే అనుకోకుండా నిర్మాతగా మారా. మంచి కథా బలమున్న స్క్రిప్ట్ ఇది. ఇలాంటి స్క్రిప్ట్ వింటే ఎవరైనా ఎగ్జైట్ అవ్వాల్సిందే. దీన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలో జరిగే కథయినా.. ఎక్కడా రా లుక్ ఉండదు. చాలా పాలిష్ లుక్ కనిపిస్తుంటుంది. మంచి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. తెరపై కనిపించే కలర్స్, విజువల్స్.. ప్రతిదీ చాలా విభిన్నంగా ఉంటాయి.
ఇంతకీ స్కైలాబ్ కథేంటి? ఈ చిత్రం చేయడానికి ముందు స్కైలాబ్ గురించి ఏమైనా కథలు విన్నారా?
తెలంగాణలోని బండలింగపల్లి అనే గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూనే కథంతా తిరుగుతుంటుంది. వాటిలో రెండు పాత్రల్ని సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ పోషించగా.. మరో పాత్రలో నేను నటించా. నేనిందులో జర్నలిస్ట్ గౌరమ్మగా కనిపిస్తా. మా ముగ్గురికి వేరు వేరు లక్ష్యాలుంటాయి. అయితే స్కైలాబ్ వల్ల మా జీవితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవేంటి? దాని వల్ల మాకెదురైన సమస్యలేంటి? అన్నది తెరపై చూడాలి.
ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికారు. ఎలా అనిపించింది?
నాకు తెలంగాణ యాసంటే చాలా ఇష్టం. ఈ చిత్రం కోసం తొలిసారి ఆ యాసలో సంభాషణలు పలకడం మంచి అనుభూతినిచ్చింది. అది కూడా లైవ్ లొకేషన్లో.. సింక్ సౌండ్లో చెప్పా. సినిమా పూర్తయ్యాక ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మళ్లీ డబ్బింగ్ చెబుదామనుకున్నా. కానీ, ఎక్కడా ఒక్క మాట కూడా మళ్లీ మార్చాల్సిన అవసరమే రాలేదు. అంత కచ్చితత్వంతో తెలంగాణ యాసలో మాట్లాడా. సినిమా మొత్తం గౌరమ్మ పాత్రని చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. ఒక్కసారి ఆ కాస్ట్యూమ్ వేసుకున్నానంటే చాలు.. టక్కున ఆ పాత్రలోకి వెళ్లిపోయేదాన్ని.
‘భీమ్లా నాయక్’ విశేషాలేంటి? పవన్ కల్యాణ్తో కలిసి పని చేయడం ఎలా ఉంది?
పవన్తో కలిసి పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. సెట్లో ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఎలాంటి సీన్ అయినా ఠక్కున చేసి.. చూపిస్తారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ సర్ నాకు ఫోన్ చేసినప్పుడు.. ‘భీమ్లా నాయక్’ కోసం ఓ లేడీ పవన్ కల్యాణ్ను తీసుకొస్తానని, మీ ఇద్దరికీ సరిగ్గా సరిపోతుంద’ని పవన్తో అన్నట్లు చెప్పారు. సెట్లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని సరదాగా గుర్తు చేస్తుండేవారు. ఈ చిత్రంలో నా పాత్ర చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ఓ పాట చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో పవన్ సర్తో నేను నిర్మాతగా ‘స్కైలాబ్’ చేస్తున్నట్లు చెప్పా. చాలా ఆశ్చర్యపోయారు. ప్రత్యేకంగా అభినందించారు.
ఇకపై తెలుగులో మీ నుంచి వరుస సినిమాలు చూడొచ్చా?
వేరే భాషల్లో చేయడం వల్ల గ్యాప్ వచ్చినట్లు అనిపిస్తోంది కానీ, ఈ ఆరేళ్లలో నేను ఏరోజు ఖాళీగా లేను. ప్రస్తుతం తమిళంలో ధనుష్తో ఓ సినిమా చేస్తున్నా. హిందీలో ‘బ్రీత్’ సిరీస్ చేస్తున్నా. తెలుగులో ‘భీమ్లా నాయక్’తో పాటు అమెజాన్ కోసం ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్సిరీస్ చేస్తున్నా. అలాగే ఇంకొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని నేనే నిర్మించనున్నా. నా దృష్టిలో రియల్ ఆర్టిస్ట్ ఎప్పుడూ ఓ ఫ్యాక్టరీలా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడు. అది నటీనటులే కావొచ్చు.. దర్శక నిర్మాతలు కావొచ్చు.. ఎవరైనా సరే. ఎందుకంటే సినిమా అనేది ఓ సృజనాత్మక కళ. మన మనసు అలసిపోతే అది సరైన రీతిలో రాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్