Cinema News: టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న రజనీకాంత్‌ కుమార్తె

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కుమార్తె, నటుడు ధనుష్‌ సతీమణి ఐశ్వర్య తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ‘రామ్‌సేథు’, ‘గుడ్‌లక్‌ జెర్రీ’...

Published : 02 Oct 2021 15:25 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కుమార్తె, నటుడు ధనుష్‌ సతీమణి ఐశ్వర్య తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. లైకా ప్రొడెక్షన్స్‌ తెరకెక్కించనున్న ఓ సరికొత్త తెలుగు చిత్రానికి ఆమె దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఆ సంస్థ ‘రామ్‌సేతు’, ‘గుడ్‌లక్‌ జర్రీ’ సినిమాలను నిర్మిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘లైకా ప్రొడెక్షన్స్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మీ ముందుకు తీసుకురానున్నాం’ అని అన్నారు. మరోవైపు ఐశ్వర్య ఇప్పటికే ‘3’తో దర్శకురాలిగా మంచి మార్కులు కొట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని