
Brahma Mishra: బాలీవుడ్లో విషాదం.. ‘మీర్జాపూర్’ నటుడు మృతి
ముంబయి: బాలీవుడ్లో విషాదం నెలకొంది. ‘మీర్జాపూర్’ సిరీస్ నటుడు బ్రహ్మమిశ్రా (36) మృతిచెందారు. గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. మిశ్రా నాలుగేళ్లుగా ముంబయిలో ఒంటరిగానే ఉంటున్నారు. ఆయన నివసిస్తున్న భవనం నుంచి గురువారం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాత్రూమ్లో కుళ్లిన స్థితిలో ఆయన భౌతికకాయాన్ని గుర్తించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మిశ్రా మృతికి కారణం తెలియాల్సి ఉంది. ఆయన అకాల మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘హసీన్ దిల్రుబా’, ‘కేసరి’, ‘ఛోర్ ఛోర్ సూపర్ ఛోర్’ తదితర చిత్రాల్లో నటించిన మిశ్రా ‘మీర్జాపూర్’ అనే వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. లలిత్ అనే పాత్రలో మెప్పించారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.