Arjuna Phalguna: అర్జునుడి పాట

శ్రీవిష్ణు కథానాయకుడిగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృత అయ్యర్‌ కథానాయిక. తేజ మర్ని    దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాతలు.

Updated : 07 Dec 2022 16:51 IST

శ్రీవిష్ణు కథానాయకుడిగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృత అయ్యర్‌ కథానాయిక. తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాలోని ‘కాపాడేవా? రాపాడేవా?’ అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. నాయకానాయికలతోపాటు మిత్రబృందం కనిపించే ఈ పాట శక్తివంతంగా సాగుతూ, చిత్రానికి ప్రధాన ఆకర్షణగా  నిలుస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. చైతన్య ప్రసాద్‌ రచించిన ఈ గీతాన్ని మోహన భోగరాజు ఆలపించారు. ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ సంగీతం అందించారు. నరేష్‌, శివాజీరాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంభాషణలు: సుధీర్‌వర్మ, ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని