Cinema News: పాత్రే అస్త్రం..పరిధి విస్తృతం.. పాన్ ఇండియా స్థాయిలో కొత్త కలయికలు
అమితాబ్-రణ్బీర్-నాగార్జున, ఆమిర్ఖాన్-నాగచైతన్య, అక్షయ్ కుమార్-సత్యదేవ్.. ఇలాంటి కలయికలు గతంలో సినీప్రియులకు ఊహకీ వచ్చేవి కాదేమో. పాన్ ఇండియా సినిమాల రూపకల్పన...
అమితాబ్-రణ్బీర్-నాగార్జున, ఆమిర్ఖాన్-నాగచైతన్య, అక్షయ్ కుమార్-సత్యదేవ్.. ఇలాంటి కలయికలు గతంలో సినీప్రియులకు ఊహకీ వచ్చేవి కాదేమో. పాన్ ఇండియా సినిమాల రూపకల్పన వల్ల ఇలాంటి అపురూప కలయికల్ని ఇప్పుడు తెరపై చూసుకునే అవకాశం దొరుకుతోంది. వాస్తవానికి మొదటి నుంచీ తెలుగు హీరోలు పరభాషా చిత్రాల్లో మెరవడం చాలా తక్కువే. గతంలో చిరంజీవి, నాగార్జున వంటి వారు ఇతర భాషల్లో అతిథి పాత్రల్లో తళ్కున మెరిసినా.. కీలక పాత్రధారిగా మరో హీరోతో తెర పంచుకున్న సందర్భాలు తక్కువే. ఓ భాషలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకుని.. మరో భాషలో సహ నటుడిగా కనిపిస్తే ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయాలు వెంటాడేవి. అందుకే ఆ తరహా ప్రయత్నాలు చేసేవారు కాదు. పాన్ ఇండియా సంస్కృతి ఆ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ప్రతి కథానాయకుడు విభిన్న పాత్రలతో అలరిస్తూ.. తన మార్కెట్ పరిధిని విస్తృతపరచుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమ ప్రతిభను అన్ని చిత్రసీమలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
తండ్రీకొడుకులు...
తెలుగులో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు నాగార్జున. దక్షిణాదిలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న ఆయన.. ఇప్పుడు హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇతిహాసాల నేపథ్యంతో అల్లుకున్న ఓ సైన్స్ఫిక్షన్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో నాగ్ ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్సత్తార్ దర్శకత్వంలో తెరకెకుతున్న చిత్రం చేస్తున్నారు. బుధవారం నుంచి దీని షూటింగ్ ప్రారంభమైంది. ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘లాల్సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్లో తొలి అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు హీరో నాగచైతన్య. ఆమిర్ స్నేహితుడిగా బాలా అనే ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇటీవలే లద్దాఖ్లో ఓ మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ వారంలో శ్రీనగర్, కశ్మీర్ ప్రాంతాల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్షయ్తో సత్యదేవ్.. దుల్కర్తో సుమంత్
‘బ్లఫ్మాస్టర్’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యభరిత చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు సత్యదేవ్. ఇటీవలే ‘తిమ్మరుసు’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన.. తెలుగులో హీరోగా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడాయన హిందీలో అక్షయ్ కుమార్ ‘రామ్సేతు’లో ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. అభిషేక్ శర్మ తెరకెక్కిస్తున్న చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే సత్యదేవ్ ఈ సెట్స్లోకి అడుగుపెట్టనున్నారు. తెలుగులో కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు సుమంత్ అక్కినేని. ఇప్పుడాయన దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న త్రిభాషా చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్నారు. కథలో ఎంతో ప్రాధాన్యమున్న ఓ పాత్రని సుమంత్ పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం హైదరాబాద్లో ఓ ప్రత్యేక సెట్ని సిద్ధం చేశారు. ఇప్పుడా సెట్లోనే కీలక సన్నివేశాలు తెర కెక్కించనున్నారు.
అజిత్ కోసం ప్రతినాయకుడిగా..
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తొలి అడుగులోనే సినీ దృష్టిని ఆకర్షించాడు హీరో కార్తికేయ. ఓవైపు కథానాయకుడిగా అలరిస్తూనే.. నాని ‘గ్యాంగ్లీడర్’ సినిమాలో విలన్గానూ మెప్పించాడు. ఇప్పుడు అజిత్ హీరోగా నటిస్తున్న ‘వాలిమై’తో తమిళ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది. ఇందులో అజిత్ సీబీసీఐడీ అధికారిగా దర్శనమివ్వనున్నారు. ఆయనతో తలపడే ప్రతినాయకుడిగా కార్తికేయ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..