Tollywood: వినోదాలు కురిసే... వర్షాకాలం
వేసవి వినోదాలు క్లైమాక్స్కు వచ్చేశాయి. ‘ఎఫ్3’తో ఈ సమ్మర్ సీజన్కు శుభం కార్డు పడనుంది. అయితే.. ఆ తర్వాతా కొత్త సినిమాల జోరు ఇదే స్థాయిలో కొనసాగనుంది.
వేసవి వినోదాలు క్లైమాక్స్కు వచ్చేశాయి. ‘ఎఫ్3’తో ఈ సమ్మర్ సీజన్కు శుభం కార్డు పడనుంది. అయితే.. ఆ తర్వాతా కొత్త సినిమాల జోరు ఇదే స్థాయిలో కొనసాగనుంది. వానా కాలంలో సినీప్రియుల్ని వినోదాల జల్లుల్లో తడిపేందుకు పలు క్రేజీ చిత్రాలు సిద్ధమయ్యాయి. వాటిలో ఇప్పటికే కొన్ని చిత్రీకరణలు పూర్తి చేసుకోగా.. మరికొన్ని సెట్స్పై తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
పండగలు.. వేసవి సెలవులు.. సాధారణంగా స్టార్ హీరోల దృష్టి ఎప్పుడూ వీటిపైనే ఉంటుంది. తమ చిత్రాల్ని ఈ సెలవుల సీజన్లలోనే బాక్సాఫీస్ బరిలో నిలిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక జూన్ నుంచి ఆగస్ట్ వరకు చిన్న సినిమాలకు దారి వదిలేస్తుంటారు. పిల్లల చదువులు మొదలయ్యేది.. వానలు జోరందుకునేది ఈ నెలల్లోనే కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి కాస్త తగ్గుతుంది. అందుకే ఈ మూడు నెలల్లో చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాల సందడే ఎక్కువ కనిపిస్తుంటుంది. ఈసారి రానున్న మూడు నెలలు స్టార్ హీరోల సందడే కనిపించనుంది. ప్రతివారం రెండు మూడు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి.
జూన్లో నాలుగు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. 3న కమల్హాసన్ ‘విక్రమ్’తో పాటు అడివి శేష్ ‘మేజర్’ బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నాయి. ‘విక్రమ్’లో కమల్తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి స్టార్లు ప్రధాన పాత్రలు పోషించడం, ‘ఖైదీ’లాంటి హిట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ తెరకెక్కించడం, సూర్య అతిథి పాత్రలో సందడి చేయనుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక శేష్ నటించిన ‘మేజర్’పైనా ఇదే స్థాయిలో అంచనాలున్నాయి. దీనికి హీరో మహేష్బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
జూన్ 10న నాని ‘అంటే.. సుందరానికి’ సినిమాతో సందడి చేయనున్నారు. ‘బ్రోచేవారెవరురా’ వంటి హిట్ తర్వాత వివేక్ ఆత్రేయ నుంచి వస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలోని ‘‘రాంగో రంగ’’ గీతాన్ని ఈనెల 23న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.
జూన్ 17న రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’తో, సత్యదేవ్ ‘గాడ్సే’తో బాక్సాఫీస్ ముందు రంగంలోకి దిగనున్నారు. వీటిలో ‘రామారావు..’పై మంచి అంచనాలున్నాయి. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన చిత్రమిది. ఇక జూన్ 24న కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ సినిమాతో సందడి చేయనున్నారు.
ఒకటో తేదీ నుంచే జాతర
జులైలో డజను సినిమాలు థియేటర్లకు రానున్నాయి. వాటిలో అరడజనకు పైగా చిత్రాలపై క్రేజ్ ఉంది. జులై 1న గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, రానా ‘విరాటపర్వం’, వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ‘పక్కా కమర్షియల్’ను మారుతి చక్కటి కమర్షియల్ ఎంటర్టైనర్గా ముస్తాబు చేయగా.. ‘విరాటపర్వం’ను విప్లవంతో ముడిపడిన వినూత్నమైన ప్రేమకథతో రూపొందించారు వేణు ఊడుగుల. ఇక ‘రంగ రంగ వైభవంగా’ను కొత్త దర్శకుడు గిరీశాయ తెరకెక్కించారు.
నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ కలయికలో రూపొందిన ‘థ్యాంక్ యూ’ జులై 8న విడుదల కానుంది. ‘మనం’ వంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. చైతన్య మూడు గెటప్పుల్లో కనిపించనున్నారు.
రామ్ హీరోగా లింగుస్వామి తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా జులై 14న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజే ‘హ్యాపీ బర్త్డే’తో థియేటర్లలో సందడి చేయనుంది లావణ్య త్రిపాఠి. ‘మత్తు వదలరా’ ఫేం రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రమిది. వినూత్నమైన కామెడీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. జులై 22న నిఖిల్ ‘కార్తికేయ 2’, 28న కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ’, 29న అడివి శేష్ ‘హిట్2’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
నెలంతా యాక్షనే
ఆగస్ట్లో పాన్ ఇండియా చిత్రాల సందడి ఎక్కువగా కనిపించనుంది. వీటితో పాటు పలువురు యువ స్టార్లు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కల్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ ఆగస్ట్ 5న విడుదల కానుంది. చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కించారు దర్శకుడు వశిష్ఠ. ఆగస్ట్ 12న సమంత తొలి పాన్ ఇండియా చిత్రం ‘యశోద’తో పాటు అఖిల్ స్పై యాక్షన్ సినిమా ‘ఏజెంట్’, నితిన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినీప్రియుల్ని పలకరించనున్నాయి.
ఇక ఆగస్ట్ 25న ‘లైగర్’గా బాక్సాఫీస్ ముందుకు రానున్నారు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందింది. ఇందులో మైక్ టైసన్ కీలక పాత్రని పోషించడం మరో విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా