హిందీలో డబ్బింగ్‌ చెప్పనున్న విజయ్!

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్‌’. అనన్య పాండే కథానాయిక. బాలీవుడ్‌లోనూ

Updated : 10 Aug 2022 12:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్‌’. అనన్య పాండే కథానాయిక. బాలీవుడ్‌లోనూ విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్‌ తన పాత్రకు హిందీలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారు. ఇందుకోసం హిందీ పదాలపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకొంటోంది. ఏ భాషా నటుడు అయినా అందరివాడు అనిపించుకోవాలంటే, స్థానిక భాషలో డబ్బింగ్‌ చెప్పుకొంటే ఇంకా బాగా రాణిస్తారని సినీ విమర్శకులు చెబుతుంటారు. చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ సైతం హిందీలో డబ్బింగ్‌ చెప్పాలని విజయ్‌ని ప్రొత్సహిస్తున్నారట. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు నటిస్తున్నారు. మణిశర్మ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబర్‌ 9, 2021న ‘లైగర్‌’ విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని