జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!.
జాతీయ ఛానళ్లకు ఎన్నికల ఇంటర్వ్యూలు
అహం బ్రహ్మాస్మి అన్నట్లు.. అన్నీ తానేనని గొప్పలు
భారీ పరిశ్రమలతో ఉద్యోగాలు రానే రావట
ఈనాడు, అమరావతి: అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. ఇదీ ఇటీవల రెండు జాతీయ టీవీ ఛానళ్లతో సీఎం జగన్ ఇంటర్వ్యూలు సాగిన తీరు. ఎన్నికల్లో తన పార్టీకి ఎదురే లేదని, ప్రజలు తనను, తన పాలనను చూసి మాత్రమే ఓట్లేస్తారు తప్ప, అభ్యర్థులు ఎవరన్నది అప్రస్తుతమని అహంభావాన్ని చాటుకున్నారు. ఒక కుటుంబం నుంచి ఒక తరంలో ఒకరే రాజకీయాల్లో ఉండాలని, అందుకే చెల్లెలు షర్మిలను రాజకీయాలకు దూరంగా ఉండమన్నానంటూ... కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. భారీ పరిశ్రమలతో ఉద్యోగాలేం వస్తాయంటూ పెదవి విరిచేశారు..! ఆ ఇంటర్వ్యూల్లో జగన్ సమాధానాలు చెప్పిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆ ఇంటర్వ్యూల్లో కొన్ని కీలక అంశాలపై జగన్ స్పందన, వాస్తవాలేంటో చూద్దాం.
నేనే హీరో.. అభ్యర్థులంతా జీరో
జగన్: ‘‘ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిగా నాపైన ప్రజల్లో వ్యతిరేకత లేదు. కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంటుంది. ప్రజలు నన్ను చూసే ఓటేస్తారు. ఇది ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి జరుగుతున్న ఎన్నిక కాదని, భవిష్యత్తును మలుపుతిప్పే ఎన్నిక అని ప్రచారంలో పదే పదే చెబుతున్నాను.’’
ఇది పెత్తందారీ పోకడ కాదా?
మీరు మాత్రమే హీరో... అభ్యర్థులంతా డమ్మీలని చెప్పదలుచుకున్నారా? మిమ్మల్ని చూసే ఓటేస్తారని అంత నమ్మకం ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో అభ్యర్థులను ఎందుకు మార్చారు? ఏ భవిష్యత్తు కోసం ప్రజలు మీకు ఓటేయాలి జగన్? ఐదేళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకా? అప్పుల కుప్పగా మార్చేసినందుకా? అని ప్రజలు నిలదీస్తున్నారు.
మీది ఏ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోనో పాఠాలు చెప్పాల్సిన స్థాయి!
జగన్: ‘‘మీరు ఏ గ్రామంలోకైనా వెళ్లండి.. సచివాలయం కనిపిస్తుంది. నాలుగు అడుగులేస్తే రైతుభరోసా కేంద్రం ఉంటుంది, మరికొద్ది దూరంలో విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. వాలంటీర్లు ఉన్నారు... ఇంగ్లిషు మీడియం స్కూల్ ఉంది... ఇవన్నీ గ్రామ పురోగతికి తోడ్పడతాయి. అయినా ప్రభుత్వం వల్ల, భారీ పరిశ్రమల వల్ల వచ్చే ఉద్యోగాలెన్ని? ఎంఎస్ఎంఈలు, స్వయం ఉపాధి రంగాల వల్లే ఉద్యోగాలు వస్తాయి. మత్స్యకారులు, వీధి వ్యాపారులు, ఆటోడ్రైవర్లు వంటివారికి చేయూతనివ్వకపోతే గ్రోత్ ఎలా వస్తుంది?’’ అంటూ జగన్ తనదైన ‘అభివృద్ధి నమూనా’ను ఆవిష్కరించారు.
అభివృద్ధికి నిర్వచనం భలే చెప్పారే: ప్రఖ్యాత ఆర్థికవేత్తలకూ తట్టని మీ అభివృద్ధి నమూనా గురించి వింటే మిమ్మల్ని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి ప్రఖ్యాత సంస్థలు ఎగరేసుకుపోయినా ఆశ్చర్యం లేదు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమనైనా తేకుండా, ఉన్నవాటినే తరిమికొట్టిన మీరు... పరిశ్రమల వల్ల ఉద్యోగాలు రావని చెప్పడంలో ఆశ్చర్యమేముంది? ఒకచేత్తో అరకొర తాయిలాలిస్తూ... వివిధ ఛార్జీలు, పన్నులు, ధరలు పెంచేసి వారి నడ్డి విరుస్తున్నారు.
అమరావతిపై విషం కక్కడం మానరా?
జగన్: అమరావతి ఎక్కడ ఉంది? అటు గుంటూరులో లేదు. ఇటు విజయవాడలో లేదు. వాటికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం బంజరు భూమి. అమరావతిలో రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకే రూ.లక్ష కోట్లు కావాలి. అంత డబ్బు వెచ్చించాలంటే 20 ఏళ్లు పడుతుంది. విశాఖ ఏపీలోనే పెద్ద నగరం. ఐదు, పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడుతుంది.
విశాఖను ఏం ఉద్ధరించారు?: విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం మాకు ఆమోదయోగ్యమే, 30వేల ఎకరాలైనా ఉండాలని... విపక్ష నేతగా అసెంబ్లీలో చెప్పినప్పుడు... మీ బుద్ధి ఏమైంది? అయినా విశాఖను ఈ ఐదేళ్లలో ఏం ఉద్ధరించారు? అక్కడ విలువైన భూముల్ని, ప్రాజెక్టుల్ని నొక్కేయడం, గత ప్రభుత్వంలో వచ్చిన కంపెనీల్ని, పెట్టుబడుల్ని తరిమేయడం తప్ప ఆ ప్రాంతానికి ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా?
చెల్లెల్ని రాజకీయాల్లోకి రావద్దనడం.. మీ పురుష దురహంకారం కాదా?
జగన్: రాజకీయాల్లో ఒక తరంలో ఒక వ్యక్తే లీడ్ చేయాలి. మిగతావాళ్లు సపోర్టింగ్ క్యారెక్టర్లుగా ఉండాలి. ఒకే జనరేషన్ నుంచి ఎంతమంది వస్తారు? అందుకే నా చెల్లెల్ని రాజకీయాల్లోకి రావద్దని చెప్పాను. వ్యాపారం చేసుకోవాలని, సపోర్టు చేస్తామని చెప్పాను.
రాజకీయాలు మీ సొత్తా?: ఇంతవరకు రాజకీయాల్లో ఇలాంటి కొత్త సిద్ధాంతం ఎక్కడా విని ఉండం. మీ మాటలు పురుష దురహంకారానికి అద్దం పట్టడం లేదా? మీ తండ్రి రాజశేఖరరెడ్డి, మీ బాబాయి వివేకానందరెడ్డి ఏకకాలంలో రాజకీయాల్లో లేరా? మీ తండ్రి జీవించి ఉన్నప్పుడే మీరెందుకు రాజకీయాల్లో ప్రవేశించారు?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్