బే ఏరియాలో ‘సర్కారు వారి పాట’ మేనియా

మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’.

Updated : 12 May 2022 20:33 IST

అమెరికా: మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తోంది.  మహేశ్‌బాబుకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా అమెరికాలోనూ ఈ సినిమా భారీగా విడుదల చేశారు. అభిమానులనే కాదు, అన్ని వర్గాలనూ అలరించేలా సినిమా ఉండటంతో అమెరికాలో ఉన్న మహేశ్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు రెండున్నర ఏళ్ల తరువాత తెరపై మహేశ్‌బాబు సినిమా రావడంతో అమెరికాలోని బే ఏరియాలో  ఫ్యాన్స్ సందడి చేశారు.

బే ఏరియా మహేశ్‌బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు, బావార్చి రెస్టారెంట్స్‌ అధినేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో  ‘సర్కారువారి పాట’ ప్రదర్శిస్తున్న థియేటర్‌ ఎదుట అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మహేశ్‌బాబు ఫ్యాన్స్ సతీష్ బొల్లా, నాగార్జున కోవి, అజయ్ యార్లగడ్డ, సయ్యద్ ఫౌజన్, అజయ్, కౌషిక్, సుబ్బారావు తలచిరు, అమర్ అనుగంటి, వెంకట్ సాదినేని, రాజా శేఖర్ కొండా, అనిల్ యడ్లపల్లి, ప్రకాష్, సందీప్ ఇంటూరి, గోకులన్, శివ తదితరులు మహేశ్‌ కటౌట్‌లకు పాలాభిషేకం చేశారు. అమెరికాలో మొత్తం 440కు పైగా లొకేషన్స్‌లో ‘సర్కారువారి పాట’ విడుదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని