లండన్లో వైభవంగా ‘తాల్’ ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
లండన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 27న సత్తావిస్ పాటిదార్ సెంటర్, వెంబ్లి, లండన్లో నిర్వహించిన ఈ వేడుకలకు భారీ సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత డాక్టర్ చంద్రబోస్ హాజరై సందడి చేశారు. ఆయనతో పాటు వీఐపీలు ఫెల్తామ్, హెస్టన్ ఎంపీ సీమా మల్హోత్రా, హెచ్సీఐ లండన్ నుంచి నందితా సాహూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబోస్ తెలుగు భాష, సంస్కృతిని కీర్తిస్తూ ఆశువుగా పాటలు పాడి అలరించారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితో కలిసి ఆస్కార్ అవార్డు అందుకోవడంపై తన అనుభవాలను పంచుకున్నారు. వేదికపై తన సతీమణి సుచిత్రతో కలిసి ఆయన తన కెరీర్పై ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాల్ ధర్మకర్తల మండలి, శ్రీధర్ వనం, వంశీ మోహన్, సత్యేంద్ర పగడాల, రాములు దాసోజు, భారతి కందుకూరి, ఇతరులతో సహా మునుపటి బోర్డుల సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. భారతదేశం వెలుపల తెలుగు భాష, సంస్కృతిని పెంపొందించేందుకు తాల్ ఎలా గౌరవిస్తుంది.. ఎలా పనిచేస్తుందనే అంశంపై నాటు నాటు శైలిలో తన ఆశువుగా పాటలతో ప్రశంసించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్లౌసెస్టర్ ప్రదర్శించిన ప్రహ్లాద నాటకం అతిథులను మైమరిపించింది. క్లాసికల్, ఫ్యూజన్ నృత్య ప్రదర్శనలు అన్ని వయసుల వారిని ఆకట్టుకున్నాయి. గాయకులు దీపు, నూతన మోహన్ఆలపించిన పాటలకు ప్రేక్షకులు స్టెప్పులేసి ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమానికి వింధ్య విశాఖ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తాల్ కల్చర్ సెంటర్లకు చెందిన విద్యార్థులు టాలీవుడ్ మెలోడీలు, శాస్త్రీయ గానాలు, నృత్యాలు ప్రదర్శించారు. తాల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈవెంట్లలో సహ ప్రదర్శనలు చేసే అవకాశం తమకు లభించిందని యూకేలోని ఇతర తెలుగు సంస్థల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకల కోసం గత నాలుగు నెలలుగా అహర్నిశలు శ్రమించిన ధర్మకర్తల మండలి కిరణ్ కప్పెట, అనిల్ అనంతుల, శ్రీదేవి ఆలెద్దుల, అశోక్ మాడిశెట్టి, వెంకట్ నీల, రవి మోచర్ల, ఐటీ ఇంఛార్జి రాయ్ బొప్పనలకు ఛైర్మన్ రవి సబ్బ కృతజ్ఞతలు చెప్పారు. TAL ఉగాది 2024 కన్వీనర్ బాలాజీ కల్లూర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అనేక మంది వాలంటీర్లకు, దీర్ఘకాల మద్దతుదారులకు, కొత్త, పాత సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మే 5 నుంచి తాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు
తాల్ చైర్మన్ రవి సబ్బ మే 5న ప్రారంభమయ్యే తాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు అందరినీ ఆహ్వానించారు. 14 వారాలపాటు ఈస్ట్ , వెస్ట్ లండన్లలో జరిగే ఈ పోటీల్లో 10 తేంస్ టైటిల్ కోసం పోటీ పడబోతున్నాయన్నారు. ఈవెంట్ను యూట్యూబ్, ఫేస్బుక్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, మద్దతుదారులు యాఫ్లో స్కోర్లను చూడొచ్చని తెలిపారు. TAL వార్షిక పత్రికను ఆవిష్కరించిన డాక్టర్ చంద్రబోస్.. సంపాదకులు రమేష్ కలవలను సత్కరించారు. మ్యాగజైన్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన సూర్య కందుకూరి.. ఈ ఏడాది ప్రచురణను నాణ్యతతో రూపొందించడానికి కృషి చేసిన సబ్ ఎడిటర్లు, పత్రిక బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కార్మికుల సేవలను గౌరవిస్తూ మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు. -
పోలింగ్కు పోటెత్తిన ఎన్నారై తెదేపా నేతలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..
Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
తానా ఆధ్వర్యంలో సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీ విద్యార్థులకు రిఫ్రెష్ వర్క్షాప్
సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీకి కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం తానా న్యూ ఇంగ్లాండ్ ఛాప్టర్ ‘తానా రిఫ్రెష్ వర్క్షాప్’ను నిర్వహించింది. -
సింగపూర్లో ఎన్నారైలతో ఘనంగా డా.రామ్మాధవ్ పుస్తక పరిచయ కార్యక్రమం
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్లో ప్రవాస భారతీయులతో డా.రామ్మాధవ్ రచించిన నూతన గ్రంథం ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. -
ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్లో ఎన్నికల ప్రచారం
ఎన్నారై తెదేపా కువైట్ ఆధ్వర్యంలో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతుగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. -
‘సామెతలు.. తెలుగు భాషకు సింగారం..’
సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిదీ అని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అన్నారు. తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం ‘తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు’ అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగింది. -
యూకేలో ఘనంగా ఉగాది సంబరాలు.. TAS నూతన కార్యవర్గం ఎన్నిక
యూకేలోని స్కాట్లాండ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
ఘనంగా ‘కెంటకీ తెలుగు సంఘం’ ఉగాది వేడుకలు
కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత