మహారాష్ట్రలో భాజపాకు చుక్కెదురు!
మహారాష్ట్రలో డిసెంబరు 1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాజపాకు చుక్కెదురైంది. మొత్తం మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా భాజపా కేవలం ఒకచోట మాత్రమే గెలుపొందింది.........
ముంబయి: మహారాష్ట్రలో డిసెంబరు 1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాజపాకు చుక్కెదురైంది. మొత్తం మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా భాజపా కేవలం ఒకచోట మాత్రమే గెలుపొందింది. మిగిలిన నాలుగు స్థానాల్లో శివసేన నేతృత్వంలోని అధికార ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటమి విజయం దాదాపు ఖరారైంది.
ఔరంగాబాద్ గ్రాడ్యుయేట్ డివిజన్లో ఎన్సీపీకి చెందిన సతీష్ చవాన్ గెలుపొందారు. పుణె గ్రాడ్యుయేట్ డివిజన్లోనూ ఎన్సీపీ నేత అరుణ్ లాడ్ విజయం సాధించారు. పుణెలో ఓటమి భాజపాకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ స్థానానికి భాజపా మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రాతినిథ్యం వహించారు. ఈ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో దేవేంద్ర ఫడణవీస్తో కలిసి పాటిల్ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, వారి వ్యూహాలు ఫలించలేదు.
నాగ్పూర్ గ్రాడ్యుయేట్ డివిజన్లో కాంగ్రెస్ నేత అభిజిత్ వంజరీ, పుణె టీచర్స్ సెగ్మెంట్లో కాంగ్రెస్ నాయకుడు జయంత్ అస్గావోంకర్ ఆధిక్యంలో ఉన్నారు. అమరావతి టీచర్స్ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి కిరణ్ సర్నాయక్ ముందంజలో ఉన్నారు. పూర్తి ఫలితాలు వెలువడే సరికి వీరి విజయం దాదాపు ఖరారుకానుంది.
ఈ ఫలితాలపై దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మా అంచనాల ప్రకారం రాలేదు. మేం మరికొన్ని సీట్లు ఆశించాం. కానీ, ఒకచోటే గెలుపొందాం. మహా వికాస్ ఆఘాడీ కూటమి బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయాం’’ అని అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. తాజా ఫలితాలు మహా వికాస్ ఆఘాడీ కూటమి ఏడాది పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?