JP Nadda: ఎన్డీయే భేటీకి 38 పార్టీలు హాజరవుతున్నాయ్: నడ్డా
మంగళవారం సాయంత్రం జరగనున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నట్టు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా వెల్లడించారు.
దిల్లీ: ఈ నెల 18న దిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి (NDA Meeting) సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నట్టు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఎన్డీయే పరిధి పెరిగిందన్నారు. గత 9ఏళ్లలో అనేకమంది ప్రశంసలు అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకత్వాన్ని అందరం చూశామని తెలిపారు. నేడు, రేపు బెంగళూరులో విపక్షాల భేటీకి 26 పార్టీలు హాజరయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దిల్లీలో నడ్డా మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వ పథకాలు, విధానాల సానుకూల ప్రభావం కారణంగా ఎన్డీయే భాగస్వామి పక్షాలు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. ఎన్డీయే కూటమిని దేశానికి సేవ చేసేందుకు, బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఆదర్శ కూటమిగా అభివర్ణించిన నడ్డా.. యూపీయేకు నాయకుడే కాదు.. నిర్ణయాలు తీసుకొనే శక్తి కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. వారిది స్వార్థ ప్రయోజనాల ఆధారంగా ఏర్పడిన పొత్తులేనని విమర్శించారు.
జేడీఎస్ కథ ముగిసిపోయిందన్న భ్రమలో కాంగ్రెస్ ఉంది : కుమారస్వామి
గత తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలనలో అవినీతిని ఉపేక్షించలేదని.. కరోనాను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచారని నడ్డా కొనియాడారు. ఎన్డీయే ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో సుపరిపాలన అందించిందని.. అందుకోసం నిరంతరం కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.28లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి బదిలీ చేసినట్టు వెల్లడించారు. నేడు, రేపు విపక్షాల భేటీ బెంగళూరులో జరుగుతున్న వేళ ఎన్డీయే తన బలాన్ని నిరూపించుకునేలా నిర్వహించే రేపటి ఎన్డీయే భాగస్వామ్యపక్షాల భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM