తెలంగాణలో ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలి
అఖిలపక్షం ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైకోర్టు సైతం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చలనం లేదని విమర్శించారు...
హైదరాబాద్: అఖిలపక్షం ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైకోర్టు సైతం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చలనం లేదని విమర్శించారు. అఖిలపక్షం ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఉద్యమ కార్యాచరణను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
శుక్రవారం నాంపల్లిలోని తెజస కార్యాలయంలో అఖిపక్షం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోదండరాం, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాలకంటి రాంగారెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ...‘‘హైకోర్టు చెప్పిన మేరకు రాష్ట్రంలో విస్తృతంగా ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలి. ఆరు నెలల పాటు ప్రతి కుటుంబానికి రూ.7,500తోపాటు ఉచిత రేషన్ ఇవ్వాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ ఉపాధిహామీ పథకం ప్రవేశ పెట్టి ఉపాధి కల్పించాలి. తొలగించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకుని పనికి సమాన వేతనం ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్ చేశారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ... రాజ్యాంగం కల్పించిన ఆహార భద్రత, జీవించే హక్కులను కేసీఆర్ విస్మరిస్తున్నారన్నారు. అసెంబ్లీ వేదికగా కరోనాపై కేసీఆర్ హేళనగా మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆరోగ్య సమస్యలేమైనా వచ్చాయా? సమావేశాలు నిర్వహించే స్థితిలో లేరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పేద ప్రజలను ఆదుకునే వరకు అఖిలపక్షం పోరాడుతుందని రమణ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో అఖిలపక్షం డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆగష్టు 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
దేశంలో ఇప్పటికీ మెరుగైన వైద్యం అందడం లేదని చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సచివాలయం కూల్చివేత, హరితహారంపై దృష్టి పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడి, ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
262.. ఉఫ్ఫ్ఫ్.. పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM