రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి అధ్వానం:లక్ష్మణ్
దళారులకు కొమ్ముకాసే కొన్ని రాజకీయశక్తులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తు్న్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
హైదరాబాద్: దళారులకు కొమ్ముకాసే కొన్ని రాజకీయశక్తులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తు్న్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో మేలు జరుగుతుంటే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపడితే కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు దుష్ర్పచారం చేశాయన్నారు. నాటి ఆర్థిక సంస్కరణల వల్లే ప్రపంచంలో 5వ అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలిచిందన్నారు.
తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఓయూ విద్యార్థిపై తెరాస నేతలు దాడికి పాల్పడ్డారని.. దీన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఆరేళ్ల తెరాస పాలనలో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. పట్టభద్రుల, కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధికోసం ఉద్యోగాల పేరుతో తెరాస నాటకాలాడుతోందని లక్ష్మణ్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!