సాగుచట్టాల రద్దుకు బెంగాల్‌ అసెంబ్లీ తీర్మానం

కేంద్ర నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.

Updated : 29 Jan 2021 12:45 IST

కోల్‌కతా: కేంద్ర నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సభలో రసాభాస నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా సభ్యులంతా వెల్‌ వద్దకు దూసుకెళ్లడంతో సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కేంద్ర వ్యవసాయ చట్టాలపై తృణమూల్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని పలువురు భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. అనంతరం ‘జైశ్రీరామ్‌’ అంటూ నినాదాలిస్తూ.. సభ నుంచి వాకౌట్‌ చేశారు.

తీర్మానంపై సభలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘కేంద్ర వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. రైతుల్ని దేశద్రోహులుగా ముద్రించడాన్ని మేం ఎప్పటికీ అంగీకరించం. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోసం ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి. వ్యవసాయ చట్టాలను పూర్తిగా కేంద్రం రద్దు చేయాలి. లేదంటే అధికారం నుంచి వైదొలగాలి’ అని మమతా బెనర్జీ డిమాండు చేశారు. దిల్లీలో గణతంత్ర దినోత్సవాన జరిగిన హింసాత్మక ఘటనలపై స్పందిస్తూ.. ఆ ఘటన పూర్తిగా ఇంటెలిజెన్స్‌ వైఫల్యంగా పేర్కొన్నారు. పరిస్థితి చేజారి పోవడానికి పూర్తి బాధ్యత పోలీసులదేనని ఆరోపించారు. 

ఇదీ చదవండి

ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని