సాగుచట్టాల రద్దుకు బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
కేంద్ర నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
కోల్కతా: కేంద్ర నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సభలో రసాభాస నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా సభ్యులంతా వెల్ వద్దకు దూసుకెళ్లడంతో సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కేంద్ర వ్యవసాయ చట్టాలపై తృణమూల్ తప్పుడు ప్రచారం చేస్తోందని పలువురు భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. అనంతరం ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలిస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.
తీర్మానంపై సభలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘కేంద్ర వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. రైతుల్ని దేశద్రోహులుగా ముద్రించడాన్ని మేం ఎప్పటికీ అంగీకరించం. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోసం ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి. వ్యవసాయ చట్టాలను పూర్తిగా కేంద్రం రద్దు చేయాలి. లేదంటే అధికారం నుంచి వైదొలగాలి’ అని మమతా బెనర్జీ డిమాండు చేశారు. దిల్లీలో గణతంత్ర దినోత్సవాన జరిగిన హింసాత్మక ఘటనలపై స్పందిస్తూ.. ఆ ఘటన పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యంగా పేర్కొన్నారు. పరిస్థితి చేజారి పోవడానికి పూర్తి బాధ్యత పోలీసులదేనని ఆరోపించారు.
ఇదీ చదవండి
ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి