సాగుచట్టాల రద్దుకు బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
కేంద్ర నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
కోల్కతా: కేంద్ర నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సభలో రసాభాస నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా సభ్యులంతా వెల్ వద్దకు దూసుకెళ్లడంతో సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కేంద్ర వ్యవసాయ చట్టాలపై తృణమూల్ తప్పుడు ప్రచారం చేస్తోందని పలువురు భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. అనంతరం ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలిస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.
తీర్మానంపై సభలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘కేంద్ర వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. రైతుల్ని దేశద్రోహులుగా ముద్రించడాన్ని మేం ఎప్పటికీ అంగీకరించం. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోసం ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి. వ్యవసాయ చట్టాలను పూర్తిగా కేంద్రం రద్దు చేయాలి. లేదంటే అధికారం నుంచి వైదొలగాలి’ అని మమతా బెనర్జీ డిమాండు చేశారు. దిల్లీలో గణతంత్ర దినోత్సవాన జరిగిన హింసాత్మక ఘటనలపై స్పందిస్తూ.. ఆ ఘటన పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యంగా పేర్కొన్నారు. పరిస్థితి చేజారి పోవడానికి పూర్తి బాధ్యత పోలీసులదేనని ఆరోపించారు.
ఇదీ చదవండి
ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?