నా వద్ద 121 భాజపా సభ్యుల చిట్టా ఉంది: రౌత్
విశ్వసనీయ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు వాటి ప్రాముఖ్యత తగ్గుతోందని శివసేన ఎంపీ సంజయ్రౌత్ ఆరోపించారు. పంజాబ్-మహారాష్ట్ర బ్యాంకు(పీఎంసీ)బ్యాంకు కుంభకోణం కేసులో తన భార్య వర్షకు ..
ముంబయి: విశ్వసనీయ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు వాటి ప్రాముఖ్యత తగ్గుతోందని శివసేన ఎంపీ సంజయ్రౌత్ ఆరోపించారు. పంజాబ్-మహారాష్ట్ర బ్యాంకు(పీఎంసీ) కుంభకోణం కేసులో తన భార్య వర్షకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా సమావేశంలో దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేశారు. తనతో ఎవరైనా రాజకీయంగా తలపడాలనుకుంటే ఎదురుగా వచ్చి ఢీకొట్టాలని భాజపాకు పరోక్షంగా సవాల్ విసిరారు.
‘ఈడీ సమన్లు జారీ చేసిన విషయమై నేను ఇప్పటికే సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించా. దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. శివసేన తగిన రీతిలో వారికి జవాబు ఇస్తుంది. విశ్వసనీయ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు ప్రాముఖ్యత తగ్గుతోంది. గతంలో ఈ ఏజెన్సీలు ఏదైనా చర్యలు తీసుకుంటే అందులో ఆ అంశం ఎంతో తీవ్రమైనదిగా ఉండేది. కానీ, గత కొద్ది సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీ తన కోపాన్ని ప్రదర్శించినపుడే.. ఈ ఏజెన్సీలు చర్యలు తీసుకుంటున్నాయి. నా వద్ద భాజపాకు చెందిన 121 మంది సభ్యుల ఫైల్స్ ఉన్నాయి. వాటిని త్వరలోనే ఈడీకి సమర్పిస్తాను. ఈడీ ఇంకా ఐదేళ్ల పాటు పనిచేయడానికి సరిపడా మంది పేర్లు ఉన్నాయి’ అని రౌత్ తీవ్రంగా మండిపడ్డారు.
పీఎంసీ బ్యాంకు స్కాం కేసులో శివసేన ఎంపీ సంజయ్రౌత్ భార్య వర్షకు సంబంధాలున్నాయంటూ ఈడీ ఆదివారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. పీఎంసీ బ్యాంకు స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రవీణ్ రౌత్కు వర్షకు మధ్య లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఆరోపించింది. దీంతో ఈ కేసు విచారణలో భాగంగా ఆమె డిసెంబర్ 29న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. కాగా ఈడీ ఈ నెలలో ఆమెకు సమన్లు జారీ చేయడం ఇది మూడో సారి కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం