అది పార్టీ నిర్ణయం..ఈసీకి సంబంధం లేదు..
తనను ఎన్నికల సంఘం (ఈసీ) స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగించడంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సుప్రీంను ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి
దిల్లీ: తనను ఎన్నికల సంఘం (ఈసీ) స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగించడంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ రాష్ట్రంలో వచ్చే వారంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తున్నారని, తమ హెచ్చరికలను సైతం విస్మరిస్తున్నారని మండిపడిన ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. స్టార్ క్యాంపెయినర్గా ఆయన్ను అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఇకపై కమల్ నాథ్ ఏ నియోజకవర్గంలోనైనా ప్రచారానికి వెళ్తే..ఆయనకు సంబంధించిన ఖర్చులన్నీ అక్కడి అభ్యర్థులే భరించాలని స్పష్టం చేసింది.
కాగా, ఈసీ నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయించిన కమల్ నాథ్..‘ఒక వ్యక్తిని స్టార్ క్యాంపెయినర్గా నియమించడం పార్టీ హక్కు. పార్టీ నిర్ణయాల్లో ఈసీ జోక్యం చేసుకోలేదు. ఇది ప్రాథమిక హక్కు అయిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం కిందికే వస్తుంది’ అని కోర్టుకు వెల్లడించారు. అలాగే తన తొలగింపునకు సంబంధించి ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు.
ఇటీవల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భాజపా మహిళా అభ్యర్థిని అభ్యంతరకర పదజాలంతో దూషించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఈసీ ఆయన్ను హెచ్చరించింది. కాగా, ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబావుటా ఎగరవేయడంతో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. అసమ్మతి ఎమ్మెల్యేలు అంతా సింథియాతో కలిసి భాజపాలో చేరారు. అనంతరం వారు తమ శాసనసభ స్థానాలకు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం