ఆయుష్ కార్యదర్శి సస్పెన్షన్కు కనిమొళి డిమాండ్
ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటెచ్చాపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంకే నేత, ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. హిందీ మాట్లాడడం రాని వారు శిక్షణ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాలని ఆయన సూచించినందుకు ఆయనపై............
చెన్నై: ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటెచ్చాపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంకే నేత, ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. హిందీ మాట్లాడడం రాని వారు శిక్షణ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాలని ఆయన సూచించినందుకు ఆయనపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్కు ఆమె లేఖ రాశారు. ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ శిక్షణా కార్యక్రమం ఈ వివాదానికి వేదికైంది. దీనికి హాజరైన హిందీ మాట్లాడడం రాని, అర్థం చేసుకోలేని యోగా టీచర్లు, మెడికల్ ప్రాక్టీస్నర్లు కార్యక్రమం నుంచి వైదొలగాలంటూ ఆయుష్ కార్యదర్శి వ్యాఖ్యానించారు. ఈ శిక్షణకు తమిళనాడు నుంచి పలువురు హాజరయ్యారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో కనిమొళి స్పందించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకెంతకాలం ఇలాంటి వివక్ష అని ప్రశ్నించారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం మానుకోవాలని ట్వీట్ చేశారు. ఆయుష్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రధాని కార్యాలయాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ, చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సైతం దీన్ని ఖండించారు. ఇటీవల ఎయిర్పోర్టులో హిందీ మాట్లాడడం రాదన్నందుకు కనిమొళిని ఓ సీఐఎస్ఎఫ్ అధికారి ‘మీరు భారతీయులేనా’ అని ప్రశ్నించడం కలకలం రేపింది. ఈ ఘటన మరిచిపోక ముందే హిందీకి సంబంధించి మరో వివాదం తెరపైకి రావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.