ములాయం సింగ్‌ యాదవ్‌కు కరోనా

సమాజ్‌వాదీ పార్టీ  వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైరస్‌ సోకినట్టు ఆ పార్టీ వెల్లడించింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్సపొందుతున్నట్టు.........

Published : 15 Oct 2020 00:41 IST

లఖ్‌నవూ (యూపీ): సమాజ్‌వాదీ పార్టీ  వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైరస్‌ సోకినట్టు ఆ పార్టీ వెల్లడించింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్సపొందుతున్నట్టు తెలిపింది. ఇప్పటివరకైతే ఆయనకు కరోనా లక్షణాలేమీ లేవని స్పష్టంచేసింది. ములాయం ఆరోగ్యంపై ఆయన తనయుడు, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు స్పష్టంచేశారు. సీనియర్‌ వైద్యులతో సంప్రదిస్తున్నామని, ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై సమాచారం తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని