దేశం మొత్తం మీ వెంటే: సచిన్ పైలట్
ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోవడం, నిరుద్యోగం పెరగడం వంటి సమస్యలపై కేంద్రం మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను మరోనేత సచిన్ పైలట్ సమర్థించారు.
చైనా దురాక్రమణ కట్టడికి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకే
జైపూర్: ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోవడం, నిరుద్యోగం పెరగడం వంటి సమస్యలపై కేంద్రం మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను మరోనేత సచిన్ పైలట్ సమర్థించారు. శనివారం పైలట్ మీడియాతో మాట్లాడుతూ..భారత్, చైనా సరిహద్దు సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం ఇతర విషయాలను ప్రస్తావిస్తుందంటూ మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీజీ లేవనెత్తిన అంశాలు సమర్థనీయమైనవి. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. 2.10 కోట్ల మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. జీతాల్లో కోత విధిస్తున్నారు. మరోవైపు చైనా మన భూభాగంలోకి ప్రవేశిస్తోంది. భారత్, చైనా సరిహద్దు వివాదంపై ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం ఇతర విషయాల గురించి మాట్లాడుతోంది’ అంటూ ఆయన విమర్శలు చేశారు. అలాగే చైనాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దేశం మొత్తం వెంట ఉంటుందన్నారు.
శనివారం రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా కరోనా వైరస్ కారణంగా దేశం ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలన్నింటిని పక్కనబెట్టి అంతాబాగానే ఉందంటూ ప్రభుత్వం, మీడియా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్