డీఆర్సీలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే వాగ్వాదం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డీఆర్సీ సమావేశం రసాబాసగా మారింది. టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని వైకాపా ఎంపీ పిల్లి
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించగా.. ఆ వ్యాఖ్యలను అదే పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఖండించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెదేపా హయాంలోనే అవినీతి జరిగిందని ద్వారంపూడి వాదనకు దిగారు. దీనిపై తెదేపా ఎమ్మెల్యేలు చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో జోగేశ్వరరావును ద్వారంపూడి పక్కకు నెట్టేశారు. అనంతరం కాకినాడ నగరం, గ్రామీణ ప్రాంతం ముంపు బారిన పడుతుందని.. మేడలైను వంతెన నిర్మాణాన్ని తక్షణం ఆపేయాలని ఎంపీ సుభాష్ చంద్రబోస్ కోరగా.. ఈ విషయంలో ద్వారంపూడి, బోస్ మధ్య మళ్లీ తీవ్ర వాగ్వాదం జరిగింది. నేతల వాగ్వాదంతో డీఆర్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అర్ధాంతరంగా ముగించారు. సమావేశం ముగిసిన తర్వాత కూడా నేతలిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.