Kejriwal: ‘ఆ 14 స్థానాల్లో మేమే’: ‘ఇండియా’ కూటమికి మరో షాకిచ్చిన కేజ్రీవాల్
పంజాబ్ లోక్సభ స్థానాల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్(Arvind Kejriwal) వెల్లడించారు.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముంగిట విపక్ష ‘ఇండియా’ కూటమికి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆప్(AAP) మరో షాకిచ్చింది. పంజాబ్(Punjab)లో కూటమితో ఎలాంటి పొత్తు ఉండదని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) వెల్లడించారు. చండీగఢ్తో సహా మొత్తం 14 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టంచేశారు. ‘15 రోజుల్లోగా ఈ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తుంది’ అని తెలిపారు.
సీట్ల సర్దుబాటుపై సందిగ్ధం వీడకపోవడంతో పంజాబ్ విషయంలో ఇదివరకే ఆప్ ఈతరహా ప్రకటన చేసింది. తాజాగా దీనిపై కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు. మరోవైపు అస్సాంలో మొత్తం 14 లోక్సభ నియోజకవర్గాలకు గానూ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దిబ్రుగఢ్ నుంచి మనోజ్ దానోవర్, గువాహటి, తేజ్పుర్ స్థానాల నుంచి భాబెన్ చౌదరి, రిషిరాజ్ కౌంటిన్యలు పోటీ చేస్తారని వెల్లడించింది. ఈ మూడూ కాంగ్రెస్కు మంచి పట్టున్న స్థానాలే కావడం గమనార్హం.
ఆర్ఎల్డీ అడుగులు ఎన్డీయే వైపు!
సీట్ల పంపకాలను వీలైనంత తొందరగా తేల్చాలని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని పలుమార్లు కోరామని, ఎంతకూ స్పందన రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించామని ఆప్ జాతీయ కార్యదర్శి సందీప్ పాఠక్ మీడియాకు వెల్లడించారు. భాజపాని ఓడించాలంటే పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని, అభ్యర్థులను ఖరారు చేస్తే.. వాళ్లు ప్రజల్లోకి వెళ్లే వీలుంటుందని చెప్పారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్