Mamata Banerjee: భాజపాను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి: దీదీ
భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు......
కోల్కతా: భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. భాజపాను, విభజన అజెండాను ఓడించేందుకు అందరం కలిసి పోరాడాలన్నారు. ఈనెల 28నుంచి రెండు రోజులపాటు గోవా పర్యటనకు సిద్ధమైన దీదీ.. బెంగాల్ ఎన్నికల్లో సాధించిన ఉత్సాహంతో భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఓ ట్వీట్ చేశారు. ‘ఈనెల 28వ తేదీన గోవాలో నా తొలి పర్యటనకు సిద్ధమయ్యా. భాజపాను, వారి విభజన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు, సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిస్తున్నా. గత పదేళ్లుగా గోవా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.
వచ్చే ఏడాది జరిగే గోవా శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు మమతా బెనర్జీ గతంలోనే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ గోవాలో టీఎంసీ భారీ స్థాయిలో అడుగుపెడుతుందని ఆ పార్టీ ఎంపీ, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సైతం గతంలోనే వెల్లడించారు. అప్పటినుంచి పలువురు నేతలను టీఎంసీ తమ పార్టీలో చేర్చుకుంటోంది. గోవా మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరోతో సహా కొంతమంది కాంగ్రెస్ నేతలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. స్వతంత్ర్య ఎమ్మెల్యే ప్రసాద్ గోవాంకర్ మద్దతు ప్రకటించారు.
గోవాలో అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఆశిస్తోంది. కొద్దిరోజుల క్రితం గోవా రాజధాని పనాజీలో పర్యటించిన ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గోవా ప్రజలపై హామీల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని, 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం