శశికళను పార్టీలోకి తీసుకోం
తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు శశికళ చెప్పడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శశికళను తిరిగి తమ పార్టీలోకి తీసుకునేది లేదని ఏఐఏడీఎంకే డిప్యూటి కోఆర్డినేటర్ కేపీ మునుసామి వెల్లడించారు. పార్టీపై తిరిగి పట్టు సాధించాలనే యోచనతో కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఏఐఏడీఎంకే స్పష్టీకరణ
చెన్నై: తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు శశికళ చెప్పడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శశికళను తిరిగి తమ పార్టీలోకి తీసుకునేది లేదని ఏఐఏడీఎంకే డిప్యూటి కోఆర్డినేటర్ కేపీ మునుసామి వెల్లడించారు. పార్టీపై తిరిగి పట్టు సాధించాలనే యోచనతో కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోమవారం వెప్పనహళ్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలతో శశికళ ఆదివారం ఫోన్లో సంభాషించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఏఐఏడీఎంకే ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించింది. పనీర్సెల్వం, పళనిస్వామి పేర్లు చెప్పకుండా.. ఆ ఇద్దరు ముఖ్య నేతల మధ్య అంతర్యుద్ధం గురించి కార్యకర్తలతో శశికళ మాట్లాడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని వారు ఆమెను కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తమ పార్టీ కార్యకర్తలతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె చాలా రోజుల నుంచి పార్టీలో లేదని మునుసామి తెలిపారు. శశికళను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ఆమె వర్గీయులు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో నమ్మకంగా పనిచేస్తున్న కొందరితో శశికళ మాట్లాడిన విషయంపై ఓ విలేకరి ప్రశ్నించగా.. తమ పార్టీ నుంచి ఎవరూ ఆమెతో ఫోన్లో మాట్లాడలేదని సమాధానమిచ్చారు. తమలాంటి వారంతా కష్టపడి పార్టీని నిర్మించినట్లు శశికళ చెప్పిందనే మాటలను మునుసామి తోసిపుచ్చారు. ఎంజీ రామచంద్రన్ ఏఐఏడీఎంకేను స్థాపించినప్పటి నుంచి వెలకట్టలేని సేవ చేసిన కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు ముఖ్య నేతల మధ్య విభేదాల గురించి ప్రశ్నించగా.. అవన్నీ అవాస్తవాలంటూ తోసిపుచ్చారు. నియోజకవర్గాల సమస్యలపై వారికి సొంత అబిప్రాయాలు ఉండడం సహజమేనన్నారు. కానీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి వారిద్దరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు తెలిపారు. అవకాశవాదులు అవాస్తవాలను ప్రచారం చేస్తూ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యూహాలకు స్వస్తి పలకాలని ఆమెను హెచ్చరించారు. 2016 డిసెంబరులో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం శశికళ తాత్కాలికంగా పార్టీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2017లో అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీ అధ్యక్షురాలి స్థానాన్ని కోల్పోయారు. ఆ తర్వాత నిర్వహించిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో.. ఆమె అల్లుడు దినకరన్ చేసిన నియామకాలన్నీ చెల్లవంటూ తీర్మానించారు. పనీర్సెల్వం, పళనిస్వామిలకు పార్టీలో పూర్తి అధికారాలు కట్టబెడుతూ అదే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి శశికళ, ఆమె బంధువులను పార్టీలోకి తిరిగి తీసుకునేది లేదని ఏఐఏడీఎంకే నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!