Maharashtra: సీఎం పదవి దక్కదని అజిత్కు తెలుసు: ఫడణవీస్
త్వరలో మహారాష్ట్ర కొత్త సీఎంగా అజిత్ పవార్ నియమితులవుతారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. అయితే, భాజపా నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు.
ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)కు త్వరలో కొత్త ముఖ్యమంత్రి వస్తారనే ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ (Prithviraj Chavan) సైతం తాజాగా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 10.. ఆ సమయంలో ఏక్నాథ్ శిందే (Eknath Shinde) స్థానంలో ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar)ను సీఎంగా చేస్తారని ఆయన జోస్యం చెప్పారు. శిందే సహా ఆయన వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఆలోపు నిర్ణయం వస్తుందని తెలిపారు. అయితే, భాజపా నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.
‘శిందేకు తన సొంత జిల్లా ఠాణె మినహా రాష్ట్రంలోని మిగతా చోట్ల ఎలాంటి బలం లేదు. ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భాజపా ఆసక్తిగా లేదు. అజిత్ పవార్ రూపంలో ఇప్పుడు భాజపాకు ప్రత్యామ్నాయం దొరికింది. ఎన్నికల్లో శిందేకన్నా అజిత్ ఎక్కువ ప్రభావం చూపగలరు. దీంతో ఆయన్ను ముఖ్యమంత్రి చేసి ఎన్నికలకు వెళ్లాలని భాజపా అగ్ర నాయకత్వం భావిస్తోంది. సీఎం పదవి కోల్పోవడమే శిందే భవితవ్యం’ అని చవాన్ ఓ వార్తాసంస్థతో అన్నారు.
శిందేకు పొగ?.. త్వరలో ముఖ్యమంత్రిగా అజిత్!
మరోవైపు.. చవాన్ వ్యాఖ్యలను దేవేంద్ర ఫడణవీస్ తోసిపుచ్చారు. మహారాష్ట్రకు ఏక్నాథ్ శిందేనే సీఎం అని, ఆ పదవిలో ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ‘భాజపా, ఎన్సీపీ, శివసేన (శిందే వర్గం)లో దీనిపై స్పష్టమైన అవగాహన ఉంది. అజిత్కు కూడా ఈ విషయం తెలుసు. జులై 2న జరిగిన సమావేశానికి ముందే ఇదంతా వివరించాం. ముఖ్యమంత్రి విషయంలో ఎలాంటి మార్పు ఉండదు’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అజిత్తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. ఈ క్రమంలోనే సీఎం మార్పు ఊహాగానాలు జోరందుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్