Akhilesh : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు ఇంకా టికెట్ రాలేదు.. అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు!
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా (BJP) విడుదల చేసిన రెండు జాబితాల్లో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) పేరు లేకపోవడంపై సమాజ్వాదీ (Samajwadi) పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇంటర్నెట్ డెస్క్ : భాజపా (BJP) విడుదల చేసిన అభ్యర్థుల జాబితాల్లో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) పేరు లేకపోవడంపై సమాజ్వాదీ (Samajwadi) పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ముఖ్యమంత్రికి టికెట్ కేటాయిస్తామని ఇప్పటిదాకా ప్రకటించలేదు. భాజపాలోని నాయకులందరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో భాజపా ఎంత భయపడుతోందో ఊహించుకోవచ్చని’ ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపాను గద్దె దించాలంటే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కలిసి పనిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా - జనసేన ప్రభుత్వమే: పవన్ కల్యాణ్
అంతకముందు కాంగ్రెస్ సైతం శివరాజ్ సింగ్ చౌహాన్కు టికెట్ రాని విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది. ‘భాజపా జాబితాలు బయటకు వస్తున్నాయి. ఈ విషయంపై మాట్లాడటానికి శివరాజ్ వద్ద ఎలాంటి సమాచారం లేదు. ఎందుకంటే వాటిలో ఆయనకు గిట్టని వారి పేర్లున్నాయి. ఇన్నాళ్లయినా ఇంకా చౌహాన్ పేరు జాబితాల్లో కనిపించడం లేదు. ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి జాబితాలోనైనా ఆయన పేరు ఉంటుందో లేదో తెలియడం లేదని’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ అన్నారు.
భాజపా ఇప్పటి వరకు 79 పేర్లను ప్రకటించింది. అందులో కేంద్రమంత్రులు నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ పేర్లున్నాయి. వీరంతా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడే అవకాశం ఉంది. వీరు మాత్రమే కాక ఎంపీలు గణేశ్ మంత్రి, రాకేశ్ సింగ్, రీతి పాఠక్లకు భాజపా సీట్లు కేటాయించింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఎన్నికల సంఘం ఇంత వరకూ షెడ్యూల్ విడుదల చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM