LokSabha Polls: కాంగ్రెస్తో చర్చల వేళ.. తొలిజాబితా ప్రకటించిన అఖిలేశ్
కాంగ్రెస్తో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతోన్న సమయంలోనే 16 లోక్సభ స్థానాలకు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్రంలో భాజపాను ఎదుర్కొనేందుకు ఏర్పడిన విపక్షాల కూటమి ‘ఇండియా’లో (INDIA) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని ఆరోపిస్తున్న మిత్రపక్షాలు.. సొంత నిర్ణయాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సమాజ్వాదీ పార్టీ (SP) కూడా మరో అడుగు ముందుకు వేసింది. కాంగ్రెస్తో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతోన్న సమయంలోనే 16 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) విపక్ష పార్టీలు కలిసి పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటికి సంబంధించి చర్చలు జరుపుతున్నాయి. అయితే అనూహ్యంగా ఉత్తర్ప్రదేశ్లో 16 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. అఖిలేశ్ (Akhilesh Yadav) భార్య డింపుల్ యాదవ్కు మైన్పురి స్థానాన్ని ఖరారు చేసింది. అయినప్పటికీ, కూటమిలో మిత్రపక్షమైన కాంగ్రెస్కు 11 సీట్లు పక్కన పెట్టినట్లు తెలిపింది.
30 గంటల పాటు సీఎం ‘మిస్సింగ్’.. నాడు తండ్రి శిబు కూడా..!
ఈ విషయంపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించారు. పార్టీ ఏదీ ఉత్తమమైందని భావిస్తుందో అదే చేస్తుందన్నారు. కాంగ్రెస్ నుంచి ఎటువంటి క్లియరెన్స్ అవసరం లేదన్నారు. ఇదిలాఉంటే, కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ బయటకు వెళ్లిపోవడం, పశ్చిమబెంగాల్, పంజాబ్లలో కాంగ్రెస్తో కాకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్, ఆప్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్