ANDHRA NEWS : సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ విప్‌ ఆగ్రహం

సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి ...

Published : 28 Jan 2022 16:41 IST

అమరావతి: సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. ఒక ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా ఆయన మాట్లాడారని విమర్శించారు. ‘కడప ప్రజలు హత్యలు చేస్తారని.. వారికి ఎయిర్‌పోర్టు అవసరమా’ అని అంటారా? అని ప్రశ్నించారు. సోము వీర్రాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వలాభం కోసం సినిమాల్లో ఆ ప్రాంత సంస్కృతిని దిగజార్చారని విమర్శించారు. రాయలసీమ ప్రజలను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరణ చేశారని చెప్పారు. రాయలసీమ సంస్కృతిని కించపరిచేలా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎఫ్‌ఐఆర్‌లు ఎక్కువ ఉన్నాయో వీర్రాజు చూడాలని శ్రీకాంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. 

వివరణ ఇచ్చిన సోము వీర్రాజు

తన వ్యాఖ్యలపై విమర్శలు వస్తుండటంతో సోము వీర్రాజు వివరణ ఇచ్చారు.  తన ఉద్దేశం అది కాదని చెప్పారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడానన్నారు. కడప ప్రజలకు హత్యా రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని