Atchannaidu: ఏపీ భవిష్యత్తు కోసం జరిగేదే ‘యువగళం విజయోత్సవ సభ’: అచ్చెన్నాయుడు

యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే సభ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

Published : 16 Dec 2023 17:36 IST

అమరావతి: యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే సభ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో భారీ సభ ఏర్పాటు చేసేందుకు తెదేపా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సభకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఎన్నికల శంఖారావం పూరించే సభగా విజయోత్సవ సభను అభివర్ణించారు. సభకు 6 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు అచ్చెన్న తెలిపారు. విజయోత్సవ సభలోనే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేద్దామనుకున్నామని.. అయితే, ఇది యువగళం సభ అయినందున ప్రకటించడం లేదని చెప్పారు. త్వరలోనే తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల కలయికతో సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.

యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభకు తెదేపా (TDP) ప్రత్యేక రైళ్లను సైతం ఏర్పాటు చేసింది. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి 7 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ప్రత్యేక రైళ్లు ఈ నెల 19న చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రారంభమై తర్వాతి రోజు విజయనగరం చేరుకోనున్నాయి. ఒక్కో రైలులో 1300 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు అద్దెకు బస్సులను సమకూర్చాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు లేఖ రాసినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని