Politics: బెంగాల్ అసెంబ్లీలో గందరగోళం
పశ్చిమ్బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి శాసనసభ సమావేశాల్లో గందరగోళం చోటు చేసుకుంది. అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు...
ప్రసంగం ముగించకుండానే వెళ్లిపోయిన గవర్నర్
కోల్కతా: పశ్చిమ్బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి శాసనసభ సమావేశాల్లో గందరగోళం చోటు చేసుకుంది. అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రసంగం పూర్తికాకుండానే గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
2021-22 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలను నేటి నుంచి జులై 8 వరకు నిర్వహించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. జులై 7న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా.. ప్రతి పక్ష భాజపా సభ్యులు నిరసనకు దిగారు. ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న దాడులను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో దాదాపు 5 నిమిషాలపాటు గవర్నర్ తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ సభ్యులు ఆందోళనను విరమించకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇది భాజపా పన్నిన ఎత్తుగడ అని, అందువల్లే గవర్నర్ మధ్యలో ప్రసంగాన్ని ఆపేసి వెళ్లిపోయారని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు స్పీకర్ బిమన్ బెనర్జీ సభను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.