Hyderabad: సీఎం రేవంత్‌ను కలిసిన భారాస ఎమ్మెల్యే

సీఎం రేవంత్‌రెడ్డితో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు.

Updated : 03 Mar 2024 12:34 IST

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో భారాసకు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. కుటుంబసభ్యులతో వెళ్లి సీఎంను కలిశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలంటూ వినతిపత్రాన్ని రేవంత్‌రెడ్డికి వెంకట్రావు అందజేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎంను ఆయన కలవడం ఇది రెండోసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని